మంత్రి పేరిట వాట్సప్‌ సందేశాలు

సైబర్‌ నేరగాళ్లు ఏకంగా వ్యవసాయ శాఖ మంత్రి డీపీ పెట్టి డబ్బులు పంపాలంటూ మోసాలకు తెగబడుతున్నారు.

Published : 08 Dec 2022 06:42 IST

ఈనాడు, హైదరాబాద్‌: సైబర్‌ నేరగాళ్లు ఏకంగా వ్యవసాయ శాఖ మంత్రి డీపీ పెట్టి డబ్బులు పంపాలంటూ మోసాలకు తెగబడుతున్నారు. మంత్రి నిరంజన్‌రెడ్డి ఫొటోను డీపీగా మార్చుకున్న మోసగాళ్లు 9353849489 నంబరు నుంచి వాట్సప్‌నకు సందేశాలు పంపిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి నిరంజన్‌రెడ్డి స్పందించారు. డబ్బులు పంపాలంటూ తన పేరిట వచ్చే సందేశాలను ఎవరూ నమ్మవద్దని, ఆ నంబరుకు డబ్బులు పంపవద్దని ప్రజలు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలకు ఒక ప్రకటనలో సూచించారు. సైబర్‌ నేరగాళ్లపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని