ధన్‌బాద్‌ ఐఐటీలో హైదరాబాద్‌ విద్యార్థి ఆత్మహత్య

ఝార్ఖండ్‌ రాష్ట్రం ధన్‌బాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ)లో చదువుతున్న హైదరాబాద్‌కు చెందిన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు.

Published : 08 Dec 2022 04:50 IST

ధన్‌బాద్‌(ఝార్ఖండ్‌): ఝార్ఖండ్‌ రాష్ట్రం ధన్‌బాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ)లో చదువుతున్న హైదరాబాద్‌కు చెందిన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు. అక్కడి ఐఐటీలో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ నాలుగో సంవత్సరం చదువుతున్న చెరుకూరి ప్రవీణ్‌ మంగళవారం తన హాస్టల్‌ గదిలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని