అంగన్వాడీ కార్యకర్త ఆకస్మిక మృతి
తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం గాడాలలోని అంగన్వాడీ కేంద్రంలో సుబ్బలక్ష్మి(45) అనే కార్యకర్త గురువారం ఆకస్మికంగా మృతి చెందారు.
కోరుకొండ, న్యూస్టుడే: తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం గాడాలలోని అంగన్వాడీ కేంద్రంలో సుబ్బలక్ష్మి(45) అనే కార్యకర్త గురువారం ఆకస్మికంగా మృతి చెందారు. విధి నిర్వహణలో ఒత్తిడికి గురైన ఆమె గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. విధుల్లో భాగంగా గ్రామంలోని మూడో నంబరు అంగన్వాడీ కేంద్రానికి సుబ్బలక్ష్మి హాజరయ్యారు. ఈలోగా ఉన్నతాధికారులు వస్తున్నారని, రికార్డులు సిద్ధం చేసుకోవాలంటూ సమాచారం రావడంతో ఒకింత ఒత్తిడికి గురైనట్లు సమాచారం. ఆమెకు భర్త, కుమారుడు ఉన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Supreme Court: ఎట్టకేలకు కదిలిన కేంద్రం..! ఆ అయిదుగురి నియామకాలకు ఆమోదం
-
Politics News
BRS: నాందేడ్లో భారాస బహిరంగ సభకు సర్వం సిద్ధం
-
Movies News
social look: అనుపమ మెరుపులు.. ప్రియా ప్రకాశ్ హొయలు.. హెబ్బా అందాలు..
-
Politics News
CM KCR: కేసీఆర్తో పలు రాష్ట్రాల నేతలు భేటీ.. భారాసలో చేరేందుకు సుముఖత
-
India News
Tamil Nadu: ఉచిత చీరల పంపిణీలో తొక్కిసలాట.. నలుగురు మహిళల మృతి
-
Sports News
IND vs AUS: ఆసీస్ జట్టు బుర్రలో ఇప్పటికే అశ్విన్ తిష్ట వేశాడు: జాఫర్