Andhra News: పప్పుల చీటీ... పక్కా లూటీ
పప్పుల చీటీల పేరిట వినియోగదారులను ఆకట్టుకుని, డబ్బులు వసూలు చేసిన వ్యాపారి... చివరికి పరారైన ఘటన విశాఖలో చోటుచేసుకుంది.
విశాఖలో సరికొత్త మోసం
విశాఖపట్నం(జగదాంబకూడలి), న్యూస్టుడే: పప్పుల చీటీల పేరిట వినియోగదారులను ఆకట్టుకుని, డబ్బులు వసూలు చేసిన వ్యాపారి... చివరికి పరారైన ఘటన విశాఖలో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన ప్రకారం... పూర్ణామార్కెట్కు చెందిన మణికుమార్(45) పదేళ్ల క్రితం స్థానికంగా 9స్టార్ ఎంటర్ప్రైజెస్ రైస్, ఆయిల్ హోల్సేల్ దుకాణం ప్రారంభించాడు. బియ్యం, పప్పులు, నూనెలను తక్కువ ధరలకిస్తూ స్థానికుల విశ్వాసం చూరగొన్నాడు. క్రమంగా శాశ్వత వినియోగదారులు పెరగడంతో చీటీలను ప్రారంభించారు. నెలకు రూ.500 చొప్పున చెల్లిస్తే ఏడాదికయ్యే రూ.6 వేలకు మరో రూ.2వేలు కలిపి రూ.8వేల విలువైన సరకులను వినియోగదారులకు అందజేసేవాడు. ఈ కార్యక్రమానికి సంక్రాంతి, దసరా, వినాయక చవితి పప్పుల చీటీలుగా పేరు పెట్టి, చైన్ పథకం అమలు చేశాడు. వినియోగదారుడు తన తరఫున ఎవరినైనా పథకంలో చేర్పిస్తే ప్రత్యేక రాయితీలు ఇచ్చేవాడు. దాంతో కూలీలు, ఆటో డ్రైవర్లు, భవన నిర్మాణ కార్మికులు, గృహిణులు, కూరగాయల విక్రేతలు, సన్నకారు రైతులు ఇలా... వందల మంది చేరారు.
ఏడాది నుంచి తప్పిన క్రమం: ఏడాది క్రితం మణికుమార్ గుండెకు శస్త్రచికిత్స జరిగింది. దీంతో దుకాణానికి రావడం తగ్గించాడు. చీటీలు వేసిన వారికి పండగలకు సమయానికి సరకులనూ ఇవ్వలేదు. దాంతో కొందరు సభ్యత్వాన్ని విరమించుకున్నారు. తమ డబ్బులనూ వెంటనే చెల్లించాలని మిగిలిన వారంతా ఒకేసారి ఒత్తిడి తెచ్చారు. శనివారం అందరికీ సరకులు/డబ్బులు చెల్లిస్తానని వారం క్రితం మణికుమార్ హామీ ఇచ్చాడు. శనివారం 60 మంది వరకు దుకాణం వద్దకు చేరుకున్నారు. ఆయన రాకపోవడంతో మోసపోయినట్లు గ్రహించారు. దీనిపై విశాఖ ఒకటో టౌన్ సీఐ రేవతమ్మ మాట్లాడుతూ... ‘మణికుమార్ గతంలోనూ ఇలాంటి మోసాలకు పాల్పడినట్లు మా విచారణలో తేలింది. బాధితుల నుంచి రూ.60-70 లక్షల వరకు వసూలు చేసి ఉంటాడని అంచనా వేస్తున్నాం’ అని వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్