Murder: రూ.4 కోట్ల ఇన్సూరెన్స్‌కు ఆశపడి స్నేహితుడి హత్య

బీమా సొమ్ముకోసం మహారాష్ట్రలో కొందరు వ్యక్తులు తమ స్నేహితుడిని హత్య చేశారు. అర్జున్‌ రమేశ్‌ భలేరావ్‌ అనే వ్యక్తి నాసిక్‌లో నివసిస్తున్నాడు. అతని పేరు మీద రూ.4 కోట్ల బీమా పాలసీ ఉంది.

Updated : 15 Dec 2022 07:16 IST

బీమా సొమ్ముకోసం మహారాష్ట్రలో కొందరు వ్యక్తులు తమ స్నేహితుడిని హత్య చేశారు. అర్జున్‌ రమేశ్‌ భలేరావ్‌ అనే వ్యక్తి నాసిక్‌లో నివసిస్తున్నాడు. అతని పేరు మీద రూ.4 కోట్ల బీమా పాలసీ ఉంది. దీంతో అతనిని చంపి ఆ సొమ్మును కాజేయాలని మిత్రులు పన్నాగం రూపొందించారు. రమేశ్‌ కొన్నాళ్లుగా నాసిక్‌లో లేనందున వారికి అవకాశం లేకపోయింది. మూడేళ్ల తర్వాత రమేశ్‌ నాసిక్‌ రాగా అతని నలుగురు స్నేహితులు మరో మహిళ సహాయంతో అతనిని హత్య చేశారు. ప్రమాదవశాత్తూ మిత్రుడు మృతి చెందినట్లు చిత్రీకరించారు.

బైక్‌పై ప్రయాణిస్తున్న రమేశ్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొన్నట్లు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బీమా సొమ్ము పంచుకునే విషయంలో ఐదుగురు నిందితుల మధ్య వివాదం చెలరేగింది. దీంతో వారిలో ఒకరు మృతుడి సోదరుడికి అసలు వాస్తవం చెప్పేశాడు. మృతుడి భార్య రజినీ ఉకే పేరుతో ఓ మహిళ నకిలీ వివరాలను సమర్పించి బీమా డబ్బును కాజేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల్లో ఒకరి నుంచి తుపాకీ, ఆరు తూటాలు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన ముగ్గురి కోసం గాలిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని