GHMC: నకిలీ ధ్రువపత్రాలు.. 100 మీసేవా కేంద్రాలపై కేసు నమోదుకు జీహెచ్ఎంసీ సిఫారసు
జీహెచ్ఎంసీలో కలకలం రేపిన నకిలీ జనన, మరణ ధ్రువపత్రాలపై విజిలెన్స్ విచారణ ముగిసింది. 100 మీ సేవా కేంద్రాలపై కేసులు నమోదు చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది.
హైదరాబాద్: జీహెచ్ఎంసీలో కలకలం రేపిన నకిలీ జనన, మరణ ధ్రువపత్రాలపై విజిలెన్స్ విచారణ ముగిసింది. ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్రెడ్డి విజిలెన్స్ నివేదికను జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్కు అందజేశారు. మొత్తం 400 మీసేవా కేంద్రాల్లో 21వేల నకిలీ జనన, మరణ ధ్రువపత్రాల కోసం దరఖాస్తు చేసినట్టు గుర్తించారు. 40 మీ సేవా కేంద్రాల్లో.. ఒక్కో కేంద్రంలో 100 కంటే ఎక్కువ నకిలీ జనన, మరణ ధ్రువపత్రాలు జారీ చేసినట్టు విజిలెన్స్ విచారణలో తేలింది. నివేదికను పరిశీలించిన జీహెచ్ఎంసీ అధికారులు నకిలీ ధ్రువపత్రాలు జారీ చేసిన 100 మీ సేవా కేంద్రాలపై కేసులు నమోదు చేయానలి నిర్ణయించారు. ఈమేరకు కేసులు నమోదు చేయాలని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, సిద్దిపేట పోలీస్ కమిషనరేట్లకు జీహెచ్ఎంసీ అధికారులు సిఫార్సు చేశారు. గతేడాది మార్చి నుంచి డిసెంబరు మధ్య జారీ అయిన 31,454 ధ్రువపత్రాలను ఇప్పటికే జీహెచ్ఎంసీ రద్దు చేసింది. అందులో 27,328 జనన, 4126 మరణ ధ్రువపత్రాలు ఉన్నాయి.
ఏం జరిగిందంటే..?
అవినీతిని అరికట్టాలనే ఉద్దేశంతో.. 2022 ప్రారంభంలో జనన, మరణ ధ్రువపత్రాలకు దరఖాస్తు, ధ్రువపత్రాల ముద్రణ సేవలను జీహెచ్ఎంసీ యంత్రాంగం ‘మీ సేవ’ కేంద్రాలకు బదలాయించింది. లోపభూయిష్టమైన సాఫ్ట్వేర్తో సమస్యలు తలెత్తాయి. అవగాహన లేని ఉన్నతాధికారులు ‘ఇన్స్టంట్ అప్రూవల్’ పేరుతో ప్రవేశపెట్టిన డిజిటల్ సేవలు.. నకిలీలకు తావిచ్చాయి. వివరాలు నమోదుచేసి, సరైన పత్రాలను అప్లోడ్ చేస్తే, సంబంధిత అధికారులు వాటిని పరిశీలించి సర్టిఫికెట్ మంజూరుచేయాలి. అలాంటిదేమీ లేకుండా.. నచ్చిన పేరుతో, నచ్చిన తేదీలో జనన, మరణ ధ్రువపత్రాన్ని తీసుకునే వెసులుబాటును కల్పించడంతో అక్రమార్కులు రెచ్చిపోయారు. నాన్ అవెలబులిటీ సర్టిఫికెట్, ఆర్డీవో ఉత్తర్వులు, ఇతరత్రా ధ్రువీకరణ ప్రతాలకు బదులు తెల్లకాగితాలు, చిత్తు పేపర్లను సమర్పించి.. పాత తేదీలతో జనన, మరణ ధ్రువపత్రాలను సృష్టించారు. అవకాశం ఎప్పుడు చేజారుతుందోనని.. ముషీరాబాద్, చార్మినార్, మెహిదీపట్నం, ఇతరత్రా ప్రాంతాల్లోని కొన్ని ప్రైవేటు మీసేవ కేంద్రాలవారు. రేయింబవళ్లు ఆయా కేంద్రాలను నడిపించారంటే పరిస్థితి ఎంత దారుణానికి దారితీసిందో అర్థం చేసుకోవచ్చు. 40, 50 ఏళ్ల కిందటి తేదీలతోనూ జనన ధ్రువపత్రాలు ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు బృందం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేసింది. -
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్