Sircilla: నిర్లక్ష్యంగా ట్రాక్టర్‌ నడిపిన బాలుడు.. చిన్నారి మృతి

రాజన్న సిరిసిల్ల జిల్లా మారుపాక గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. 14ఏళ్ల బాలుడు నిర్లక్ష్యంగా ట్రాక్టర్ నడిపి ఆరేళ్ల బాలిక

Published : 20 Feb 2022 17:32 IST

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా మారుపాక గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. 14ఏళ్ల బాలుడు నిర్లక్ష్యంగా ట్రాక్టర్ నడిపి ఆరేళ్ల బాలిక మృతికి కారణమయ్యాడు. వేములవాడ మండలం మారుపాకలో.. ఇటుకలు తీసుకువచ్చేందుకు 14ఏళ్ల బాలుడు అతివేగంగా ట్రాక్టర్‌ నడిపాడు. ఎదురుగా వస్తున్నవారిని తప్పించే ప్రయత్నంలో అదుపు తప్పి దీక్షశ్రీ అనే ఆరేళ్ల చిన్నారిని ఢీకొట్టాడు. దీంతో బాలిక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. .. బాలుడికి ట్రాక్టర్ ఇవ్వడం పట్ల యజమానిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని