బాలికపై గ్యాంగ్‌ రేప్‌.. సజీవ దహనం!

ఇటీవల మధ్యప్రదేశ్‌లోని సిద్ధిలో చోటుచేసుకున్న నిర్భయ తరహా ఘటన మరిచిపోకముందే బిహార్‌లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది.......

Published : 14 Jan 2021 01:28 IST

ముజఫర్‌పూర్‌: ఇటీవల మధ్యప్రదేశ్‌లోని సిద్ధిలో చోటుచేసుకున్న నిర్భయ తరహా ఘటన మరిచిపోకముందే బిహార్‌లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. నలుగురు వ్యక్తులు బాలికపై సామూహిక అత్యాచారం చేసి సజీవ దహనం చేయడం కలకలం రేపింది. జనవరి 11న ఆమె ఇంట్లోనే నిందితులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు. తీవ్ర గాయాలపాలైన బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం ప్రాణాలు విడిచిందని తెలిపారు. ఈ వ్యవహారంలో బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నలుగురు నిందితులపై కేసు నమోదు చేశామన్నారు. ఈ ఘటనపై విచారణ ప్రారంభించామని, నిందితులను అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు. 

ఇదీ చదవండి..
దాహం అంటూ వచ్చి దారుణం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు