శంషాబాద్‌ విమానాశ్రయంలో బంగారం పట్టివేత

శంషాబాద్‌ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న 1.026 కిలోల బంగారాన్ని హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దీనికి సంబంధించి ఇద్దరు వ్యక్తులను విచారించి...

Updated : 02 Apr 2021 12:10 IST

హైదరాబాద్‌: శంషాబాద్‌ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న 1.026 కిలోల బంగారాన్ని హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దీనికి సంబంధించి ఇద్దరు వ్యక్తులను విచారించి వారిపై కేసు నమోదు చేశారు. వీరిలో ఒకరు దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు బంగారాన్ని తరలిస్తున్నాడు. ప్యాకింగ్ కవర్ల లోపలి పొరలలో బంగారు రేకుల రూపంలో దాచిపెట్టి అక్రమంగా బంగారాన్ని రవాణా చేస్తున్నాడు. ఈ క్రమంలో బంగారాన్ని మరొక వ్యక్తికి అప్పగించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. పట్టుకున్న బంగారం విలువ రూ.47.63 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని