శంషాబాద్‌ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత

హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ మొత్తంలో బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇవాళ దుబాయ్ నుంచి వచ్చిన

Published : 08 May 2021 01:13 IST

శంషాబాద్‌: హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ మొత్తంలో బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇవాళ దుబాయ్ నుంచి వచ్చిన విమానంలో ఓ లగేజీ బ్యాగ్‌ను అనుమానంతో కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. అందులో బిస్కెట్ల రూపంలో దాదాపు 2.60 కిలోల బంగారం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వాటి విలువ దాదాపు రూ.1.28 కోట్లు ఉంటుందని విమానాశ్రయం కస్టమ్స్ ఉప కమిషనర్ శివకృష్ణ తెలిపారు. ఆ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు శివకృష్ణ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని