Crime news: దళిత బాలికపై సామూహిక అత్యాచారం, హత్య.. పోలీసులపై కాల్పులు

ఉత్తర్​ప్రదేశ్​లోని గోండా జిల్లాలో​ దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ దళిత బాలికపై ఇద్దరు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడి ఆపై హత్య చేశారు......

Published : 07 Feb 2022 01:37 IST

లఖ్‌నవూ: ఉత్తర్​ప్రదేశ్​లోని గోండా జిల్లాలో​ దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ దళిత బాలికపై ఇద్దరు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడి ఆపై హత్య చేశారు. అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులపైనా వారు కాల్పులకు తెగబడ్డారు. ఈ సంఘటనలో పోలీసులు ఓ నిందితుడిని అరెస్టు చేయగా మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు.

నవాబ్​గంజ్​ పోలీస్​స్టేషన్​ పరిధి గ్రామంలోని పంటపొలాల్లో శనివారం ఉదయం ఓ బాలిక మృతదేహాన్ని స్థానికులు కనుగొన్నారు. శరీరంపై గాట్లు, తీవ్ర గాయాలను గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. జిల్లా కలెక్టర్​ మార్కండేయా షాహి, ఎస్పీ సంతోష్​ మిశ్రా పోలీసు బృందంతో సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. శుక్రవారం రాత్రి బహిర్భూమి కోసం బాలిక బయటకు రాగా నిందితులు ఆమెను ఎత్తుకెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు ఎస్పీ వెల్లడించారు. నిందితులను పట్టించిన వారికి రూ.25వేల బహుమతి ఇస్తామని కూడా ప్రకటించారు. కాగా ఈ ప్రకటన అనంతరం 5 గంటలల్లోనే దుండగుల గురించి పోలీసులకు సమాచారం అందింది.

గ్రామం సమీపంలోని ఓ చెరుకు తోటలో వారు తలదాచుకున్నట్లు తెలుసుకుని ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఈ క్రమంలో తప్పించుకునేందుకు నిందితులు పోలీసులపై కాల్పులు జరిపారు. ఖాకీలు ఎదురు కాల్పులు జరపగా ఓ దుండగుడి కాలిలోకి తూటాలు దూసుకెళ్లాయి. తీవ్రంగా గాయపడిన నిందితుడు మహేశ్​ యాదవ్​ను అదుపులోకి తీసుకున్నారు. పరారైన మరో వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు ఎస్పీ సంతోశ్‌ మిశ్రా తెలిపారు. త్వరలోనే అతడిని కూడా అదుపులోకి తీసుకుంటామని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని