‘లొంగిపోతున్నా.. ప్లీజ్ నన్ను కాల్చి చంపొద్దు..’
ఉత్తర్ప్రదేశ్ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ రెండోసారి అధికారం చేపట్టనుండటంతో ఓ వ్యక్తి తీవ్రంగా భయపడుతున్నాడు.
లఖ్నవూ: ఉత్తర్ప్రదేశ్ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ రెండోసారి అధికారం చేపట్టనుండటంతో ఓ వ్యక్తి తీవ్రంగా భయపడుతున్నాడు. ఓ కేసులో నిందితుడిగా ఉన్న తనను చంపేస్తారేమో అనే భయంతో స్వచ్ఛందంగా పోలీస్స్టేషన్కి వెళ్లి లొంగిపోయాడు. తనను కాల్చి చంపొద్దని.. జైల్లో పెట్టాలని వేడుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. యూపీకి చెందిన గౌతమ్ సింగ్ అనే వ్యక్తి ఓ కేసులో నిందితుడిగా ఉన్నాడు. నేరస్థులను వదిలిపెట్టబోమని గతంలో యోగి ప్రభుత్వం హెచ్చరించడంతో తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. తాను ఆత్మసాక్షిగా లొంగిపోతున్నానని.. తనను చంపొద్దంటూ ప్లకార్డు పట్టుకుని పోలీస్స్టేషన్కు వచ్చి లొంగిపోయాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం