Crime news: లైంగిక వేధింపులపై 15మంది విద్యార్థినుల ఫిర్యాదు.. టీచర్ అరెస్టు!
ప్రభుత్వ పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు తమను లైంగికంగా వేధిస్తున్నారంటూ 15మంది విద్యార్థినులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ......
చెన్నై: ప్రభుత్వ పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు తమను లైంగికంగా వేధిస్తున్నారంటూ 15 మంది విద్యార్థినులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన తమిళనాడులోని రామనాథపురం జిల్లాలోని ఓ పాఠశాలలో చోటుచేసుకుంది. విద్యార్థినుల ఆరోపణలతో రంగంలోకి దిగిన పోలీసులు ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిని అరెస్టు చేశారు. మరో ఉపాధ్యాయుడి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నారుల సంరక్షణపై తమ పాఠశాలలో శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం అనంతరం తొమ్మిది, పదో తరగతి చదువుతున్న 15 మంది విద్యార్థినులు తమ కష్టాల్ని ఏకరవు పెట్టుకున్నారని పోలీసులు వెల్లడించారు. పాఠశాలలో మ్యాథ్స్, సోషల్ సైన్స్ బోధిస్తున్న ఇద్దరు ఉపాధ్యాయులు తమను వేధిస్తున్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారని తెలిపారు.
తరగతి గదిలో ద్వంద్వ అర్థాలు వచ్చేలా మాట్లాడటం, అనుచితంగా తమపై చేతులు వేయడం, తరగతులు పూర్తయ్యాక కూడా తరచూ ఫోన్ చేసి మాట్లాడం వంటి చేష్టలకు పాల్పడేవారని విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. బాలికల నుంచి ఫిర్యాదు అందుకున్న అనంతరం సోషల్ సైన్స్ బోధించే టీచర్ని అరెస్టు చేసినట్టు తెలిపారు. మరో ఉపాధ్యాయుడి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు చెప్పారు. జిల్లా విద్యాశాఖ అధికారి, బాలల హక్కుల అధికారులతో పాటు మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఈ ఫిర్యాదులపై విచారణ జరుపుతున్నారు.
► Read latest Crime News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు