Fake Death: తనలాగే ఉన్న యువతిని చంపి.. తానే చనిపోయినట్లు చిత్రీకరించి!
తనలాగే పోలికలు ఉన్న మరో యువతిని హత్యచేసి.. తానే ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించి, అనంతరం ప్రియుడితో కలిసి పారిపోయిందో యువతి. తీరా.. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో అసలు గుట్టు బయటపడింది.
దిల్లీ: తనలాగే పోలికలు ఉన్న మరో యువతిని హత్యచేసి.. తానే ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించి, అనంతరం ప్రియుడితో కలిసి పారిపోయిందో యువతి. తీరా.. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో అసలు గుట్టు బయటపడింది. ఉత్తర్ప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో ఈ వ్యవహారం వెలుగుచూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. నోయిడాకు చెందిన పాయల్ భాటి(22), ఆమె ప్రియుడు అజయ్ ఠాకూర్తో కలిసి.. పాయల్లాగే కనిపించే, స్థానికంగా ఓ మాల్లో పనిచేసే హేమతో స్నేహం చేశారు. పథకం ప్రకారం ఇటీవల ఆమెను ఇంటికి పిలిచిన పాయల్.. ప్రియుడితో కలిసి ఆమె గొంతు నులిమి హత్య చేసింది.
ముఖం, గొంతు నులిమిన ఆనవాళ్లు కనిపించకుండా వేడి నూనె పోసింది. చేతికి గాట్లు పెట్టి, మృతదేహానికి తన దుస్తులు తొడిగింది. ఆపై.. తనే ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరిస్తూ.. ‘వంట చేస్తుండగా.. నా ముఖం కాలిపోయింది. నాకింక బతకాలని లేదు’ అని ఓ సూసైడ్ నోట్ రాసింది. అనంతరం ప్రియుడితో కలిసి పారిపోయింది. సూసైడ్ నోట్ ఆధారంగా.. ఆమెను పాయల్గానే భావించిన బంధువులు.. అంత్యక్రియలు నిర్వహించారు. మరోవైపు.. చనిపోయిన యువతి కుటుంబ సభ్యులు ఆమె కనిపించడం లేదంటూ నవంబర్ 12న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులకు.. దర్యాప్తు చేయగా అసలు విషయం తెలిసింది.
ఈ క్రమంలోనే నిందితులిద్దరిని అరెస్టు చేశారు. పాయల్ తల్లిదండ్రులు ఆరు నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. ‘తన తల్లిదండ్రుల మరణానికి సోదరుడి అత్తింటివారితోపాటు ఓ బంధువు కారణమని పాయల్ భావించింది. ఈ క్రమంలో.. వారిని చంపాలని నిర్ణయించింది. పథకం ప్రకారం.. ముందుగా తను ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించింది. తర్వాత ప్రియుడితో కలిసి పారిపోయింది. అనంతరం వారిని హత్య చేసేందుకు.. నాటు తుపాకీ, కత్తి సైతం కొనుగోలు చేశారు’ అని పోలీసులు వెల్లడించారు. మారణాయుధాలనూ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!