Gujarat: కండోమ్ మరిచిపోయి అసహజ రీతిలో!.. చివరికి ఏమైందంటే?
గుజరాత్లోని అహ్మదాబాద్కు చెందిన ఓ వ్యక్తి కండోమ్కి బదులు జిగురును వినియోగించి మృత్యువాతపడిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.....
అహ్మదాబాద్: గుజరాత్లోని అహ్మదాబాద్కు చెందిన ఓ వ్యక్తి కండోమ్కు బదులు జిగురులాంటి పదార్థాన్ని వినియోగించి అసహజ రీతిలో కలయికలో పాల్గొని మృత్యువాతపడిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సల్మాన్ (25) అనే యువకుడు జూన్ 23న తన ఇంటి సమీపంలోని పొదల్లో అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని కొందరు గమనించారు. అతడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. సల్మాన్ ప్రమాదవశాత్తు మరణించి ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా అనుమానించారు. అయితే పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే అంశాలు బయటపడ్డాయి. అతడు అసహజ రీతిలో కలయికలో పాల్గొనడం వల్లే మృతిచెందినట్లు పోలీసులు నిర్ధరించారు.
అసలు ఏమైందంటే..?
సల్మాన్ జూన్ 22న తన ప్రేయసితో కలిసి ఓ హోటల్కు వెళ్లాడు. వెంట కండోమ్ తీసుకెళ్లడం మర్చిపోయిన సల్మాన్ దానికి బదులు జిగురు లాంటి పదార్థం (epoxy adhesive)ను వినియోగించాడు. దాని ప్రభావం వల్ల అతడి మర్మాంగం సహా పలు అవయవాలు చెడిపోయి మృత్యువాతపడ్డాడు. కండోమ్ను తీసుకెళ్లడం మర్చిపోవడంతో గర్భం రాకుండా ఉండేందుకే వారు ఆ జిగురును వినియోగించినట్లు పోలీసులు పేర్కొన్నారు. సల్మాన్తోపాటు అతడి ప్రియురాలు కూడా మత్తు పదార్థాలకు బానిసలుగా మారినట్లు గుర్తించారు. అహ్మదాబాద్ 7వ జోన్ డీసీపీ ప్రేమ్సుఖ్ మాట్లాడుతూ సల్మాన్ తాజా పోస్టుమార్టం నివేదిక ఇంకా రాలేదని.. అది వచ్చాక ఈ విషయంపై మరింత స్పష్టత రానున్నట్లు ఆయన తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు బృందం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేసింది. -
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు