Andhra News: బ్లాక్‌మెయిల్‌ చేసి డబ్బు గుంజుతున్న గుజరాత్‌ కి‘లేడీ’ ముఠా అరెస్ట్‌

గుంటూరు జిల్లాలో వాహనదారులను నుంచి డబ్బు గుంజుతున్న గుజరాత్‌ మహిళల ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ముఠాలో మొత్తం 32 మంది మహిళంలు ఉన్నట్లు

Published : 19 May 2022 02:28 IST

గుంటూరు: గుంటూరు జిల్లాలో వాహనదారులను నుంచి డబ్బు గుంజుతున్న గుజరాత్‌ మహిళల ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ముఠాలో మొత్తం 32 మంది మహిళలు ఉన్నట్లు గుర్తించారు. గుంటూరు నుంచి తెనాలి వెళ్లే మార్గంతో పాటు పెదకాకాని హైవే తదితర ప్రాంతాల్లో వాహనదారులను బెదిరించి డబ్బు గుంజుతున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు నాలుగైదు బృందాలుగా ఏర్పడి మొత్తం 18 మందిని అరెస్ట్‌ చేశారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. 

పెదకాకాని పరిధిలో ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు సీఐ బండారు సురేశ్‌బాబు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. గుజరాత్‌లోని దుర్గానగర్‌కు చెందిన ఐదుగురు యువతులు గుంటూరు సమీపంలోని ఇన్నర్‌ రింగ్‌ రోడ్డుతో పాటు కొన్ని ప్రాంతాల్లో వాహనాలను ఆపుతున్నారు. తమది గుజరాత్‌ అని.. ప్రకృతి వైపరీత్యాలతో తమ గ్రామం లేకుండా పోయిందంటూ కరపత్రాలను చూపిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారు. డబ్బులు ఇవ్వని వాహనదారుల నుంచి వాహనాల తాళాలు లాక్కొని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. డబ్బు ఇవ్వకపోతే తమతో అసభ్యంగా ప్రవర్తించారంటూ కేసు పెడతామని బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు. గుంటూరుకు చెందిన సాయితేజరెడ్డి అనే వాహనదారుడు ఇచ్చిన ఫిర్యాదుతో సదరు యువతులపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేసినట్లు సీఐ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని