Crime news: కారులో లిఫ్ట్ ఇస్తానని.. అసభ్యకరంగా తాకాడు: మహిళా ప్రొఫెసర్ ఫిర్యాదు
కారులో లిఫ్ట్ ఇస్తానని చెప్పి తోటి అధ్యాపకురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడో ప్రొఫెసర్. ఈ ఘటన గురుగ్రామ్ సెక్టార్ 9లోని ప్రభుత్వ కళాశాలలో గురువారం చోటుచేసుకుంది.
గురుగ్రామ్: కారులో లిఫ్ట్ ఇస్తానని చెప్పి తోటి అధ్యాపకురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడో ప్రొఫెసర్. ఈ ఘటన హరియాణాలోని గురుగ్రామ్ సెక్టార్ 9లోని ఓ ప్రభుత్వ కళాశాలలో గురువారం చోటుచేసుకుంది. తోటి అధ్యాపకుడు తనను లైంగికంగా వేధించినట్టు మహిళా ప్రొఫెసర్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. 35 ఏళ్ల మహిళా ప్రొఫెసర్ తన ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. కళాశాలలో గత వారం రోజులుగా యూత్ ఫెస్టివల్కు సన్నాహాలు జరుగుతున్నాయి. గురువారం రాత్రి 7.30గంటల సమయంలో రిహార్సల్స్ ముగించుకొని ఇంటికి వెళ్లేందుకు మహిళా అధ్యాపకురాలు బయల్దేరారు. ఆమె కారు పార్కింగ్ లాట్లో ఉండటంతో రవి దేశ్వాల్ అనే ప్రొఫెసర్ తన కారులో అక్కడి వరకు డ్రాప్ చేస్తానని చెప్పాడు. దీంతో కారెక్కి కూర్చోగానే తనను అనుచితంగా టచ్ చేస్తూ.. అసభ్యపదజాలం ఉపయోగించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో వెంటనే కారులోంచి బయటకు వచ్చి కేకలు వేయడంతో అక్కడే ఉన్న విద్యార్థులు, మరికొందరు అక్కడికి చేరుకుంటుండంతో అతడు కారులో పారిపోయాడని ఆమె వివరించారు. గురువారం రాత్రి మహిళా ప్రొఫెసర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రవి దేశ్వాల్పై కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. శుక్రవారం వైద్య పరీక్షల అనంతరం మహిళా ప్రొఫెసర్ను సిటీ కోర్టులో హాజరు పరిచి స్టేట్మెంట్ రికార్డు చేసినట్టు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని.. నిందితుడిని త్వరలోనే అరెస్టు చేయనున్నట్టు సెక్టార్ 9 పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ మనోజ్ కుమార్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య