Crime News: పట్టాలు తప్పిన బికనేర్ ఎక్స్ప్రెస్ రైలు.. ఐదుగురి మృతి
బెంగాల్లో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. జల్పాయిగురి జిల్లాలో బికనేర్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది.......
కోల్కతా: బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. జల్పాయిగురి జిల్లాలో బికనేర్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. దాదాపు 12 బోగీలు పట్టాలు తప్పడంతో ఐదుగురు ప్రయాణికులు దుర్మరణం చెందారు. మరో 45మంది గాయపడినట్టు అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రాజస్థాన్లోని బికనేర్ నుంచి నిన్న బయల్దేరిన ఈ రైలు పట్నా మీదుగా అసోంలోని గువాహటికి వెళ్తుండగా బెంగాల్లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ రైలు సాయంత్రం గువాహటికి చేరుకోవాల్సి ఉంది. ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించినట్టు అధికారులు తెలిపారు.
మృతులకు రూ.5లక్షల ఎక్స్గ్రేషియో
ఈ దుర్ఘటనపై రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు. ఈ ఘటన గురించి, అక్కడ జరుగుతున్న సహాయక చర్యలను ప్రధాని మోదీకి వివరించినట్టు చెప్పారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలను తానే స్వయంగా పర్యవేక్షిస్తున్నట్టు వెల్లడించారు. మరోవైపు, ఘటనలో మృతులకు రూ.5లక్షల చొప్పున భారతీయ రైల్వే ప్రకటించింది. అలాగే, తీవ్ర గాయాలపాలైన వారికి రూ.లక్ష, స్వల్పంగా గాయపడిన వారికి రూ.25వేలు చొప్పున సాయంగా ఇవ్వనున్నట్టు తెలిపింది. ఘటనా స్థలానికి శుక్రవారం ఉదయం వెళ్లనున్నట్టు రైల్వేమంత్రి అశ్వనీ వైష్ణవ్ తెలిపారు. వైద్య బృందాలు, సీనియర్ అధికారులు ఇప్పటికే చేరుకున్నారని చెప్పారు.
మోదీ విచారం
రైలు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్లో విచారం వ్యక్తంచేశారు. ఈ ఘటనపై రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్తో మాట్లాడినట్టు చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన మోదీ.. ఈ ప్రమాదంలో క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా నాయకుడి ఇంట్లో 384 మద్యం సీసాలు
శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా నాయకుడు పైడి మహేశ్వరరావు నివాసంలో దాచి ఉంచిన 384 మద్యం సీసాలను టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురికి గాయాలు
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. -
శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ముగ్గురి అరెస్ట్
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అనిశా మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ఆయన ఆస్తులకు బినామీలుగా ఉన్న వ్యాపారులు గోదావర్తి సత్యనారాయణమూర్తి(62), పెంట భరత్కుమార్(30), ప్రైవేటు ఉద్యోగి పెంట భరణికుమార్(30)ను వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దంపతులు వాటిని తీర్చే దారిలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో జరిగింది. -
నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలు
నూడుల్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన వజ్రాలు, ప్రయాణికుల శరీర భాగాల్లో, బ్యాగేజీలో ఉంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.