బూటకపు ఆత్మహత్య.. ఇన్స్టాగ్రామ్ యూజర్ అరెస్ట్!
సోషల్మీడియాలో కొంతమంది యూజర్లు.. అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తుంటారు. అలా ముంబయికి చెందిన ఓ యువకుడు తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఓ వీడియోను చిత్రీకరించి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశాడు. అది కాస్త పోలీసుల వరకు వెళ్లడంతో జైలుపాలయ్యాడు. వివరాళ్లోకి వెళ్తే.. ఇరవైఏళ్ల
ముంబయి: సోషల్మీడియాలో కొంతమంది యూజర్లు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తుంటారు. అలా ముంబయికి చెందిన ఓ యువకుడు తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఓ వీడియోను చిత్రీకరించి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశాడు. అది కాస్త పోలీసుల వరకు వెళ్లడంతో జైలుపాలయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. ఇరవైఏళ్ల ఇర్ఫాన్ఖాన్కు ఇన్స్టాగ్రామ్లో 44వేలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇటీవల అతడు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఇన్స్టాలో వీడియో పోస్టు చేశాడు. తనని ఒక అమ్మాయి.. ప్రేమించి మోసం చేసిందని, అందుకే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు పేర్కొంటూ రైల్వే ట్రాక్పై కూర్చున్నాడు. ఆ తర్వాత రైలు అతడిని ఢీకొట్టినట్లు వీడియోను ఎడిట్ చేసి అప్లోడ్ చేశాడు. ఆ వీడియో కాస్త వైరల్గా మారింది. దీంతో బాంద్రా పోలీసులు ఇర్ఫాన్ను గుర్తించి అరెస్టు చేశారు. రైల్వే చట్టాలు, భారతీయ శిక్షాస్మృతిలోని పలు సెక్షన్ల కింద అతడిపై కేసులు నమోదు చేశారు.
తాను ఈ వీడియోను ఆత్మహత్య చేసుకోకూడదని తెలియజేసే వీడియో సిరీస్లో భాగంగా తీశానని, నెటిజన్లు దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని ఇర్ఫాన్ అంటున్నాడు. ఏదేమైనా తను పొరపాటు చేసినట్లు ఒప్పుకొని క్షమాపణలు చెప్పాడు. తన ఖాతా నుంచి ఆ వీడియోను డిలిట్ చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై గులకరాయి కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్ను కస్టడీకి అనుమతిస్తూ విజయవాడ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ప్రమాదవశాత్తు పేలిన ఏకే 47.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
ప్రమాదవశాత్తు తుపాకీ పేలడంతో సీఆర్పీఎఫ్కు చెందిన అసిస్టెంట్ కమాండెంట్ శేషగిరిరావు మృతిచెందారు. -
శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ముగ్గురి అరెస్ట్
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అనిశా మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ఆయన ఆస్తులకు బినామీలుగా ఉన్న వ్యాపారులు గోదావర్తి సత్యనారాయణమూర్తి(62), పెంట భరత్కుమార్(30), ప్రైవేటు ఉద్యోగి పెంట భరణికుమార్(30)ను వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. -
నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలు
నూడుల్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన వజ్రాలు, ప్రయాణికుల శరీర భాగాల్లో, బ్యాగేజీలో ఉంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. -
వైకాపా నాయకుడి ఇంట్లో 384 మద్యం సీసాలు
శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా నాయకుడు పైడి మహేశ్వరరావు నివాసంలో దాచి ఉంచిన 384 మద్యం సీసాలను టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురికి గాయాలు
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దంపతులు వాటిని తీర్చే దారిలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో జరిగింది. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.
తాజా వార్తలు (Latest News)
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
-
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
-
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
-
రెజ్యూమె రూపొందించడంలో ఈ తప్పులొద్దు.. గూగుల్ మాజీ రిక్రూటర్ టిప్స్
-
కోటక్ బ్యాంక్కు ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డుల జారీ, కొత్త కస్టమర్ల చేరికపై ఆంక్షలు
-
‘మా పేరుతో తప్పుడు ప్రచారం’.. ప్రజలకు ఎల్ఐసీ అలర్ట్!