Andhra news: నిష్పక్షపాతంగా విచారణ చేపట్టండి: హైకోర్టు
పశ్చిమగోదావరి జిల్లా మలకపల్లి గ్రామానికి చెందిన యువకుడు గెడ్డం శ్రీను మృతి కేసులో నిష్ణాతులైన వైద్యులతో తిరిగి శవపరీక్ష నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది.
విజయవాడ: పశ్చిమగోదావరి జిల్లా మలకపల్లి గ్రామానికి చెందిన యువకుడు గెడ్డం శ్రీను మృతి కేసులో నిష్ణాతులైన వైద్యులతో తిరిగి శవపరీక్ష నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. గెడ్డెం శ్రీను మృతి కేసులో అతడి తండ్రి దాఖలు చేసిన పిటిషన్పై బుధవారం హైకోర్టు విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. 30 రోజుల్లోపు విచారణ పూర్తిచేసి నివేదిక ఇవ్వాలని గతంలో హైకోర్టు ఆదేశించినా.. పోలీసులు పట్టించుకోలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రాజకీయ కారణాలతో విచారణ నిష్పక్షపాతంగా జరగలేదని, కేసును నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారని వాదనలు వినిపించారు. ఏడుగురిపై ఎస్సీ, ఎస్టీ చట్టంతో పాటు హత్య కేసుగా తిరిగి నమోదు చేసినప్పటికీ ఏ ఒక్కరినీ అరెస్ట్ చేయలేదన్నారు. ఆత్మహత్య అంటూ కేసును మూసివేస్తున్నారని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. అటు మృతుడు పురుగు మందు తాగి చనిపోయాడని, అతడిది హత్య అని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం ఎయిమ్స్ వైద్యుల పర్యవేక్షణలో పోస్టుమార్టం నిర్వహించాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. నిప్షక్షపాతంగా విచారణ చేయాలని డీజీపీకి సూచించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.