మండ్యాలో హృదయ విదారక ఘటన

కర్ణాటకలోని మాండ్యాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణికి వైద్యం అందక ఆస్పత్రి ఎదుటే ప్రసవించింది

Published : 27 May 2021 00:23 IST

మండ్యా: కర్ణాటకలోని మండ్యాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణికి వైద్యం అందక ఆస్పత్రి ఎదుటే ప్రసవించింది. పుట్టగానే నవజాత శిశువు మరణించడంతో ఆ తల్లి కన్నీరుమున్నీరయ్యింది. అక్కడున్నవారినీ ఆ దృశ్యం కలచివేసింది. మంగళవారం పురిటి నొప్పులతో బాధపడుతున్న సోనూ.. మండ్యాలోని ఎంఐఎం ఆస్పత్రికి వెళ్లగా కొవిడ్‌ రిపోర్టు లేదని వైద్యం చేసేందుకు డాక్టర్లు నిరాకరించారు. కుటుంబ సభ్యులు ఎంతగా ప్రాధేయపడినా పురుడు పోసేందుకు ముందుకు రాలేదు. దీంతో నొప్పులు తాళలేక సోనూ అక్కడే ప్రసవించింది. ప్రసవించిన కొద్దిసేపటికి బిడ్డను కోల్పోయింది. పుట్టిన కాసేపటికే బిడ్డ చనిపోవడంతో ఆ మహిళ తీవ్రంగా రోధించడం చూపరులను కంటతడి పెట్టించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని