రాయ్‌పూర్‌ ఎయిర్‌పోర్టు వద్ద కూలిన హెలికాప్టర్‌.. ఇద్దరు పైలట్లు దుర్మరణం

ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌ విమానాశ్రయం వద్ద ఓ హెలికాప్టర్‌ కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు .....

Published : 13 May 2022 02:19 IST

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌ విమానాశ్రయం వద్ద ఓ హెలికాప్టర్‌ కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు దుర్మరణం చెందారు. ఈ విషయాన్ని ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ బాఘేల్‌ వెల్లడించారు. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తంచేస్తూ ఆయన ట్వీట్‌ చేశారు. ‘‘ఈ విషాదం గురించి ఇప్పుడే తెలిసింది. రాష్ట్రానికి చెందిన హెలికాప్టర్‌ రాయ్‌పూర్‌ విమానాశ్రయం వద్ద కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు కెప్టెన్‌ పాండా, కెప్టెన్‌ శ్రీవాస్తవ ప్రాణాలు కోల్పోయారు. ఈ తీవ్ర శోకాన్ని తట్టుకొనే శక్తిని వారి కుటుంబాలకు కలగాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నా. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా.. ఓం శాంతి’’ అని ట్వీట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని