shraddha walker: ఆఫ్తాబ్ క్రూరత్వానికి హద్దేలేదు..!
శ్రద్ధా వాకర్ హత్యకేసులో పోలీసుల చేతికి మరిన్ని ఆధారాలు దొరికాయి. వీటితోపాటు విస్తుపోయే పలు విషయాలు వెల్లడవుతున్నాయి.
ఇంటర్నెట్డెస్క్: శ్రద్ధావాకర్ హత్యకేసుకు సంబంధించి ఆఫ్తాబ్కు తాజాగా నిర్వహించిన పాలీగ్రాఫ్ పరీక్ష ద్వారా పోలీసులు కీలక విషయాలు రాబట్టారు. దిల్లీలోని రోహిణీలో ఉన్న ఫోరెన్సిక్ సైన్స్ లేబోరేటరీని ఇందుకు వినియోగించారు. నిన్న ఉదయం 12 గంటల సమయంలో ఈ పరీక్ష మొదలుపెట్టారు. పోలీసులు హిందీలో ప్రశ్నలు అడగ్గా.. అతడు ఇంగ్లిష్లో సమాధానాలు చెప్పాడు. ఈ క్రమంలో శ్రద్ధాతో సంబంధం, ఆమె హత్యకు దారితీసిన పరిణామాలు, నేరం ఎప్పుడు జరిగింది, శరీర భాగాలను ఎక్కడెక్కడ పారేశాడు .. వంటి వివరాలను అడిగారు. నేడు కూడా అతడికి పాలీగ్రాఫ్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇవి సుమారు 8 గంటలపాటు జరగనున్నాయి.
మరోవైపు నిన్న సూరజ్కుండ్ అడవుల్లో సూట్కేస్లో శరీర భాగాలు దొరికాయి. వీటిని దిల్లీ పోలీసులకు అప్పగించారు. ఈ భాగాలను డీఎన్ఏ పరీక్షలకు పంపనున్నారు.
ఐదు కత్తులు.. మూడు సీసీ కెమెరాలు స్వాధీనం..
ఆఫ్తాబ్ ఇంటి నుంచి దాదాపు ఆరు అంగుళాల పొడవున్న ఐదు కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. వీటిని పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ సైన్స్ లేబోరేటరీకి పంపించారు. దీంతోపాటు ఆఫ్తాబ్ ఛత్రపూర్ ప్రాంతంలో తిరుగుతున్న దృశ్యాలు నమోదైన మూడు సీసీటీవీ కెమెరాలను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. వీటిల్లో వందల గంటల కొద్దీ ఉన్న రికార్డులను విశ్లేషించే బాధ్యతను ఓ బృందానికి అప్పగించారు. దాదాపు 150కు పైగా సీసీ కెమెరాలను విశ్లేషించిన తర్వాత ఆఫ్తాబ్ కదలికలను గుర్తించారు.
శ్రద్ధాను సిగరెట్తో కాల్చేవాడు..
ఆఫ్తాబ్-శ్రద్ధాలు కలిసి ఉన్న సమయంలో పలు కీలక విషయాలు వెల్లడవుతున్నాయి. వారు కలిసి ఉన్న రోజుల్లో ఆఫ్తాబ్ ఆమె వీపుపై సిగరెట్తో కాల్చేవాడని తేలిసింది. ఈ విషయాన్ని శ్రద్ధా మిత్రులు నిన్న వెల్లడించారు. ఆఫ్తాబ్తో కలిసి ఉండాలని భావించిన శ్రద్ధా అతడిని భరించినట్లు పేర్కొన్నారు.
ఎలక్ట్రానిక్ ఆధారాల్లేకుండా పక్కా ప్లానింగ్..
ఆఫ్తాబ్ పక్కా ప్లానింగ్ చేసుకున్నాడని దిల్లీ పోలీస్ అధికారులు పేర్కొన్నారు. తాము అతడిని విచారించిన 12 రోజుల్లో ఈ విషయం స్పష్టంగా తెలిసిందన్నారు. శ్రద్ధా శరీర భాగాలను పారేసే సమయంలో ఎటువంటి ఎలక్ట్రానిక్ ఆధారాలు భవిష్యత్తులో పోలీసులకు చిక్కకుండా ముందు జాగ్రత్తలు తీసుకొన్నాడని వెల్లడించారు. ఆ సమయంలో తన వెంట ఫోన్ను తీసుకెళ్లకుండా ఇంట్లోనే ఉంచేవాడని పేర్కొన్నారు. పోలీసులు వాటిని విశ్లేషించినా.. సిగ్నల్స్ లొకేషన్ ఇంట్లోనే చూపించేట్లు జాగ్రత్తలు తీసుకొన్నాడని తెలిపారు.
ముందుగా ప్లాన్ చేసి.. ఛత్రపూర్లో అద్దెకు దిగి..
ఆఫ్తాబ్ దిల్లీలోని ఛత్రపూర్ ప్రాంతంలో కూడా ముందుగానే ప్లాన్ చేసి ఇల్లు తీసుకొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆఫ్తాబ్-శ్రద్ధాలు హిమాచల్ ప్రదేశ్లో ఉన్నప్పుడు బద్రీ అనే వ్యక్తి పరిచయం కాగా.. అతడి సాయంతోనే ఛత్రపూర్ ప్రాంతానికి ఆఫ్తాబ్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ప్రదేశానికి సమీపంలోనే అడవులు ఉన్నట్లు గ్రహించిన ఆఫ్తాబ్ ఛత్రపూర్లో ఇల్లు తీసుకొన్నట్లు భావిస్తున్నారు.
క్షణికావేశంలో ఆ ఘటన (శ్రద్ధా హత్య) జరిగినట్లు న్యాయస్థానం ఎదుట ఆఫ్తాబ్ చెప్పాడు. కానీ, రెండేళ్ల క్రితం శ్రద్ధా అతడిపై పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో మాత్రం తనను ముక్కలుగా నరికి చంపుతాడని పేర్కొంది. చివరికి ఆఫ్తాబ్ అలాగే ఆమెను హత్య చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన
పెద్దపల్లి జిల్లాలో మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. ముత్తారం మండలం ఓడేడు పరిధిలో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. -
సస్పెన్షన్కు గురైన సబ్రిజిస్ట్రార్ ఇంట్లో అనిశా తనిఖీలు.. రూ. 10 కోట్ల ఆస్తుల గుర్తింపు
మహబూబాబాద్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో గత నెల 22న లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖ అధికారులకు చిక్కిన సబ్రిజిస్ట్రార్ తస్లీమ మహ్మద్ ఇంట్లో అధికారులు సోమవారం మరోసారి తనిఖీలు నిర్వహించారు. -
యూసఫ్గూడలో అగ్నిప్రమాదం.. 20 కార్లు దగ్ధం!
యూసఫ్గూడలో అగ్నిప్రమాదం జరిగింది. అక్కడి గణపతి కాంప్లెక్స్లో సెకండ్ హ్యాండ్ కార్లు విక్రయించే చోట ఈ ఘటన చోటుచేసుకుంది. -
చదువుపై మక్కువతో నవ వధువు బలవన్మరణం
ఉన్నత చదువులు చదువుకుంటానని చెప్పినా కుటుంబసభ్యులు వివాహం చేయడంతో నవ వధువు పురుగుమందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం మంగయ్యబంజర్ గ్రామంలో చోటుచేసుకుంది. -
మహిళపై అమానుషానికి పాల్పడింది సంగారెడ్డి యువకులు!
మహిళపై పాశవికంగా అత్యాచారానికి పాల్పడి ఆమె మృతికి కారణమైన కేసులో పోలీసులు నిందితులను గుర్తించినట్లు తెలిసింది. -
ఏపీలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వైకాపా నాయకుడి అరెస్టు
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వైకాపా నాయకుడు బోయ మహానందిని మూడో పట్టణ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. -
మంచులో కూరుకుపోయి తెలుగు వైద్య విద్యార్థి మృతి
వైద్య విద్య కోసం కిర్గిజ్స్థాన్ వెళ్లిన తెలుగు విద్యార్థి అక్కడి జలపాతం సందర్శనకు వెళ్లి మృత్యువాత పడ్డాడు. ఈ విషాదకర ఘటన ఆదివారం చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. -
మూడు పదులు నిండకుండానే ముగిసిన జీవితాలు
పట్టుమని 30 ఏళ్లు కూడా నిండలేదు.. రెండేళ్ల కిందటే వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. భవిష్యత్తుపై ఎన్నో కలలు కంటూ.. ఆనందంగా జీవిస్తున్న ఆ దంపతుల ఆశలు అర్ధంతరంగా ఆవిరైపోయాయి. -
పంట నష్టాలతో రైతు ఆత్మహత్య
మహబూబాబాద్ జిల్లా మరిపెడ శివారు మాకుల తండాలో ఇస్లావత్ చీనా(42) అనే రైతు సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. వ్యవసాయంలో నష్టం, ఆర్థిక సమస్యలతో బలవన్మరణానికి పాల్పడ్డారు. -
రాళ్లు విసిరి.. జెండా కర్రలతో కొట్టి
తెదేపా ఎస్సీ కార్యకర్తలపై వైకాపా శ్రేణులు దాడికి పాల్పడిన ఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో చోటుచేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం.. సత్తెనపల్లి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ సోమవారం నామినేషన్ వేశారు. -
పల్నాడు జిల్లాలో తెదేపా కార్యాలయానికి నిప్పు
పల్నాడు జిల్లాలో వైకాపా నాయకులు ప్రతిపక్షాలపై దాడులకు తెగబడుతున్నారు. ఆదివారం రాత్రి బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలంలో తెదేపా కార్యాలయం వద్ద తాటాకు పందిరికి నిప్పు పెట్టారు.
తాజా వార్తలు (Latest News)
-
క్షమాపణలు యాడ్ సైజ్లోనే ప్రచురించారా? పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!