Drugs: లెహెంగాలో ₹3కోట్ల డ్రగ్స్.. బెంగళూరులో స్వాధీనం!
స్మగ్లరు రోజురోజుకీ తెలివి మీరిపోతున్నారు. మత్తుపదార్థాలను తరలించడానికి కొత్తకొత్త దారులు వెతుకుతున్నాయి. అయినా నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు వారి పప్పులు ఉడకనీయడం లేదు.
బెంగళూరు: స్మగ్లరు రోజురోజుకీ తెలివి మీరిపోతున్నారు. మత్తుపదార్థాలను తరలించడానికి కొత్తకొత్త దారులు వెతుకుతున్నాయి. అయినా నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు వారి పప్పులు ఉడకనీయడం లేదు. బెంగళూరులో ఇలాగే అతి తెలివి ప్రదర్శించిన స్మగ్లర్ల ఆటకట్టించారు ఎన్సీబీ అధికారులు. ఆస్ట్రేలియాలోని భారత సంతతి అమ్మాయిల పెళ్లి కోసమని రవాణా అవుతున్న పార్సిల్ ఒకటి బెంగళూరు విమానాశ్రయానికి వచ్చింది. విప్పి చూస్తే అందులో మూడు లెహెంగాలు. కానీ కాస్త పరీక్షగా చూసే సరికి అందులో కేజీ చొప్పున మూడు కేజీల డ్రగ్స్ దొరికాయి. వాటి విలువ దాదాపు రూ.3 కోట్లవరకు ఉంటుందని చెబుతున్నారు.
ఈ రాకెట్తో సంబంధం ఉందని భావిస్తున్న ఒక వ్యక్తిని ఎన్సీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పక్కా సమాచారంతో సరైన సమయంలో మెరుపుదాడి చేసి నిందితులను పట్టుకున్నారు. ఈ అధికారుల బృందానికి ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ అమిత్ ఘవాటే నాయకత్వం వహించారు. ఈ షిప్మెంట్ ఆంధ్రప్రదేశ్లోని నరసాపురం నుంచి వచ్చిందని, చెన్నై ద్వారా అక్కడి నుంచి ఆస్ట్రేలియాకు పంపించేలా ఆర్డర్ బుక్ చేశారని అధికారులు చెబుతున్నారు. చెన్నైలోని చిరునామా ఆధారంగా ప్రధాన నిందితులను పట్టుకునేందుకు గాలింపు చేపట్టారు. నకిలీ ధ్రువపత్రాలు, చిరునామా సమర్పించి ఈ పార్సిల్ బుక్ చేశారని అధికారులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై గులకరాయి కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్ను కస్టడీకి అనుమతిస్తూ విజయవాడ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ప్రమాదవశాత్తు పేలిన ఏకే 47.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
ప్రమాదవశాత్తు తుపాకీ పేలడంతో సీఆర్పీఎఫ్కు చెందిన అసిస్టెంట్ కమాండెంట్ శేషగిరిరావు మృతిచెందారు. -
శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ముగ్గురి అరెస్ట్
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అనిశా మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ఆయన ఆస్తులకు బినామీలుగా ఉన్న వ్యాపారులు గోదావర్తి సత్యనారాయణమూర్తి(62), పెంట భరత్కుమార్(30), ప్రైవేటు ఉద్యోగి పెంట భరణికుమార్(30)ను వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. -
నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలు
నూడుల్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన వజ్రాలు, ప్రయాణికుల శరీర భాగాల్లో, బ్యాగేజీలో ఉంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. -
వైకాపా నాయకుడి ఇంట్లో 384 మద్యం సీసాలు
శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా నాయకుడు పైడి మహేశ్వరరావు నివాసంలో దాచి ఉంచిన 384 మద్యం సీసాలను టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురికి గాయాలు
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దంపతులు వాటిని తీర్చే దారిలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో జరిగింది. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.
తాజా వార్తలు (Latest News)
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్