Vizag: పరువు హత్య.. కుమార్తెను చంపి సెల్ఫీ వీడియో పోస్టు చేసిన కన్న తండ్రి

విశాఖలో దారుణం జరిగింది. కన్నతండ్రే కుమార్తెను దారుణంగా హతమార్చాడు. పోలీసులు ఇది పరువు హత్యగా భావిస్తున్నారు.

Updated : 05 Nov 2022 01:10 IST

విశాఖపట్నం: విశాఖ రెల్లివీధిలో దారుణం జరిగింది. కన్నతండ్రే కుమార్తెను అత్యంత దారుణంగా హతమార్చాడు. ఆ తర్వాత సెల్ఫీవీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడం కలకలం రేపింది. కుమార్తెను చంపిన తర్వాత తండ్రి ప్రసాద్‌ విశాఖ వన్‌టౌన్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇది పరువుహత్యగా భావిస్తున్నారు.

13 ఏళ్ల క్రితం భర్త ప్రసాద్‌ను భార్య వదిలి వెళ్లిపోయింది. దీంతో ఇద్దరు ఆడపిల్లలను తండ్రి ప్రసాద్‌ పెంచి పెద్దచేశారు. ఈ క్రమంలో పెద్ద కుమార్తె వేరే వ్యక్తిని ప్రేమ పెళ్లిచేసుకొని  వెళ్లిపోయింది. ఇటీవల చిన్నకుమార్తె స్థానిక యువకుడిని ప్రేమించి అతడితో వెళ్లిపోయింది. దీంతో ప్రేమజంటను పోలీసులు స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. యువకుడిపై కేసులు ఉన్నాయని చెప్పినా వినలేదని తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో కుమార్తెను చంపినట్లు తండ్రి సెల్ఫీ వీడియోలో చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని