ఏడాదిన్నర పాపపై అత్యాచారం
ఏడాదిన్నర వయసున్న పసిపాపపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఊహ కూడా తెలియని ఆ చిన్నారి మరణానికి కారకుడయ్యాడు.
బహ్రాయిచ్: ఏడాదిన్నర వయసున్న పసిపాపపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఊహ కూడా తెలియని ఆ చిన్నారి మరణానికి కారకుడయ్యాడు. హృదయ విదారకమైన ఈ ఘటన ఉత్తర్ప్రదేశ్లోని బహ్రాయిచ్ జిల్లాలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ఏడాదిన్నర వయసున్న చిన్నారి సోమవారం రాత్రి తన ఇంటి ఆవరణలో నిద్రిస్తుండగా.. ముప్పయ్యేళ్ల వయసున్న నిందితుడు ఆమెను ఎత్తుకెళ్లాడు. సమీపంలో నిర్మానుష్యంగా ఉన్న పాఠశాల భవనంలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. మంగళవారం ఉదయం నిద్ర లేవగానే తమ కుమార్తె కనిపించకపోవడంతో చిన్నారి అమ్మానాన్నల్లో ఆందోళన మొదలైంది. గ్రామస్థులతో కలిసి పాపకోసం వెతకడం ప్రారంభించారు. సమీపంలోని పాఠశాల భవనంలో తీవ్ర రక్తస్రావంతో అచేతనంగా పడి ఉన్న చిన్నారిని కనుగొన్నారు. కూతురిని ఇలాంటి దారుణ స్థితిలో చూడాల్సివస్తుందనుకోలేదని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. అక్కడే ఉన్న నిందితుడిని పట్టుకొని గ్రామస్థులు చితకబాదారు. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు. అత్యాచారానికి గురైన చిన్నారిని చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లగా, అక్కడ ఆ పసిపాప ప్రాణాలు కోల్పోయింది.
పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకెళ్తుండగా.. అతడు పోలీసులపై దాడి చేసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అతడిని లొంగిపొమ్మని హెచ్చరిస్తూ పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. అయినా పరుగు ఆపకపోవడంతో తుపాకీతో కాల్చారు. నిందితుడి కాలికి గాయమైంది. వెంటనే అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరిచారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.