Crime News: ఖమ్మంలో భారీగా గంజాయి స్వాధీనం.. నలుగురి అరెస్టు

ఖమ్మం జిల్లా కేంద్రంలో పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నారు. ఒడిశా నుంచి ఖమ్మం మీదుగా రాజస్థాన్‌ తరలిస్తున్న రూ.75 లక్షల విలువైన 250 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Published : 09 Apr 2022 01:47 IST

ఖమ్మం: ఖమ్మం జిల్లా కేంద్రంలో పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నారు. ఒడిశా నుంచి ఖమ్మం మీదుగా రాజస్థాన్‌ తరలిస్తున్న రూ.75 లక్షల విలువైన 250 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఖమ్మం సీపీ విష్ణు వారియర్‌ వెల్లడించారు. ఈ కేసులో నలుగురిని అరెస్టు చేశామని.. పరారీలో ఉన్న మరో నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని సీపీ తెలిపారు. మాదకద్రవ్యాల కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఈ సందర్భంగా సీపీ చెప్పారు. అనుమానాస్పద ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని