శివమొగ్గలో భారీ పేలుడు: పలువురి మృతి?

కర్ణాటకలోని శివమొగ్గలో క్వారీలో గురువారం రాత్రి భారీ పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలువురు చనిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. పేలుడు శబ్దం దాదాపు...

Updated : 22 Jan 2021 13:52 IST

శివమొగ్గ: కర్ణాటకలోని శివమొగ్గలో క్వారీలో గురువారం రాత్రి భారీ పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలువురు చనిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. పేలుడు శబ్దం దాదాపు 15-20 కిలోమీటర్ల వరకు వినిపించినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. మరోవైపు ఆ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలో తీసుకున్నారు. ముందుజాగ్రత్తగా బాంబ్‌ స్క్వాడ్‌ బృందాలను రప్పించారు. గురువారం రాత్రి 10:20 గంటల సమయంలో ఈ భారీ పేలుడు చోటుచేసుకున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. పేలుడు శబ్దం విని భయంతో స్థానికులు ఇళ్ల నుంచి పరుగులు పెట్టారు. ఈ పేలుడుకు పలు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. పలువురు స్థానికులు దెబ్బతిన్న తమ ఇళ్ల కిటికీల ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 

ఇవీ చదవండి.. 
ట్రంప్‌ వీడ్కోలు: చాలా అందంగా ఉంది
అమెరికా మహిళలు: ఊదా రంగే ఎందుకు?


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని