Maharashtra: దుకాణంలో మానవ మెదడు, కళ్లు, చెవులు

మహారాష్ట్రలోని నాశిక్‌లో విస్తుపోయే ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ దుకాణంలో ఉంచిన మానవ మెదడు, కళ్లు, చెవులు, ముఖంలోని మరికొన్ని అవయవాలను......

Published : 29 Mar 2022 03:09 IST

ముంబయి: మహారాష్ట్రలోని నాశిక్‌లో విస్తుపోయే ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ దుకాణంలో ఉంచిన మానవ మెదడు, కళ్లు, చెవులు, ముఖంలోని మరికొన్ని అవయవాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నాశిక్‌లోని నాకా ప్రాంతానికి చెందిన ఓ దుకాణం కొద్దిరోజులుగా మూసిఉంది. అయితే అందులోనుంచి దుర్వాసన రావడాన్ని చుట్టపక్కలవారు గమనించారు. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా.. దుకాణంలో రెండు ప్లాస్టిక్‌ కవర్లలో ఉన్న మావన అవయవాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ కోసం ఫోరెన్సిక్ బృందం ఆ అవయవాలను కస్టడీకి తీసుకుంది.

ఈ అవయవాలు ఎక్కడి నుంచి వచ్చాయా అని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఆ దుకాణ యజమాని ఇద్దరు కుమారులు వైద్యులేనని, పరీక్షల కోసం తీసుకొచ్చారా? అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఈ అంశంపై పోలీసులు పలువురిని ప్రశ్నిస్తున్నారు. హత్య కోణంలోనూ విచారణ జరుపుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని