Crime News: పంజాగుట్టలో దారుణం... భార్యను హతమార్చి, రైలుకింద పడి భర్త ఆత్మహత్య
నగరంలోని పంజాగుట్టలో దారుణం చోటుచేసుకుంది. దంపతుల మధ్య ఏర్పడిన వివాదం నిండు ప్రాణాలను బలితీసుకుంది. మనస్పర్థల కారణంగా క్షణికావేశంలో భార్యను
హైదరాబాద్: నగరంలోని పంజాగుట్టలో దారుణం చోటుచేసుకుంది. దంపతుల మధ్య ఏర్పడిన వివాదం నిండు ప్రాణాలను బలితీసుకుంది. మనస్పర్థల కారణంగా క్షణికావేశంలో భార్యను చంపేసిన భర్త.. ఆ తర్వాత తానుకూడా ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం... అస్సాం రాష్ట్రానికి చెందిన మహానంద బిశ్వాస్(24), పంప సర్కార్ (22) దంపతులు జీవనోపాధి కోసం నగరానికి వచ్చి పంజాగుట్ట పరిధిలోని ప్రేమ్నగర్లో నివాసముంటున్నారు. వీరిద్దరూ జీవీకే మాల్లో సెక్యూరిటీ గార్డ్స్గా విధులు నిర్వహిస్తున్నారు.
ఈక్రమంలో దంపతుల మధ్య ఏర్పడిన వివాదం ఇద్దరినీ బలితీసుకుందని పోలీసులు భావిస్తున్నారు. సోమవారం సాయత్రం భార్యను నీళ్లతో ఉన్న బకెట్లో తలవరకు ముంచి హతమార్చాడు. ఆ తర్వాత నాంపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. బిశ్వాస్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించే సమయంలో అతని వద్ద ఉన్న చిన్న డైరీలో తన భార్యను చంపి తాను ఆత్మహత్యకు పాల్పడినట్టు రాసిన లేఖ లభ్యమైంది. వెంటనే నాంపల్లి రైల్వే పోలీసులు ఇచ్చిన సమాచారంతో పంజాగుట్ట పోలీసులు ప్రేమ్నగర్లోని అతని నివాసానికి వెళ్లారు. ఇంటికి తాళం వేసి ఉండటంతో తాళం పగులగొట్టి పంప సర్కార్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని పంజాగుట్ట డీఐ నాగయ్య తెలిపారు. క్లూస్ టీమ్ సాయంతో ఆధారాలు సేకరిస్తున్నామని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలోకి స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్