పాకిస్థాన్లో మ్యాచ్..హైదరాబాద్లో బెట్టింగ్
గుట్టుచప్పుడు కాకుండా కూకట్పల్లి, నిజాంపేట్ కేంద్రాలుగా పాకిస్థాన్లో జరుగుతున్న సూపర్ లీగ్ మ్యాచ్లకు భారీగా క్రికెట్ బెట్టింగ్లు నిర్వహిస్తున్న బుకీలను సైబరాబాద్ మాదాపూర్ ఎస్వోటీ, బాచుపల్లి పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సైబరాబాద్ సీపీ సజ్జనార్..
హైదరాబాద్: గుట్టుచప్పుడు కాకుండా కూకట్పల్లి, నిజాంపేట్ కేంద్రాలుగా పాకిస్థాన్లో జరుగుతున్న సూపర్ లీగ్ మ్యాచ్లకు భారీగా క్రికెట్ బెట్టింగ్లు నిర్వహిస్తున్న బుకీలను సైబరాబాద్ మాదాపూర్ ఎస్వోటీ, బాచుపల్లి పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సైబరాబాద్ సీపీ సజ్జనార్ మీడియాకు వెల్లడించారు. బండారీ లేఅవుట్లోని పావని రెసిడెన్సీ అపార్ట్మెంట్లో ఈ ముఠా బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు సీపీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సోమన్న, అతని అనుచరులు సత్య పవన్కుమార్, సతీష్రాజు మరో ముగ్గురు కలిసి ఈ తతంగం నడుపుతున్నట్లు చెప్పారు. నిందితుల నుంచి రూ.22.50 లక్షలు, 33 చరవాణులు, బెట్టింగ్ బోర్డు, ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఇతర దేశాల్లో జరిగే మ్యాచ్లకు సైతం వీరు బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టు గుర్తించామని సీపీ వెల్లడించారు.
‘‘ఎవరికీ అనుమానం రాకుండా జరుగుతున్న బెట్టింగ్ గురించి సమాచారం అందుకున్న వెంటనే బెట్టింగ్ నడిపిస్తున్న అపార్ట్మెంట్పై దాడి చేసి ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నాం. ప్రధాన సూత్రధారి సోమన్న తప్పించుకున్నారు. హవాలా, ఆన్లైన్లో నిందితులు నగదు బదిలీ చేస్తున్నట్టు విచారణలో తేలింది. లైవ్ లైన్గురు, క్రికెట్ మజా, లోటస్, బెట్ 365, బెట్ ఫెయిర్ వంటి యాప్ల ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టు తేలింది. పరారీలో ఉన్న సోమన్న కోసం గాలిస్తున్నాం. సోమన్న పట్టుబడితే మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉంది’’ అని సజ్జనార్ తెలిపారు. ఎక్కువ మంది యువత, విద్యార్థులు బెట్టింగ్ ఉచ్చులో చిక్కుకుంటున్నారని.. తల్లిదండ్రులు వారి పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎక్కడైనా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం తెలిస్తే డయిల్ 100, వాట్సాప్ నంబర్ 94906-17444కు సమాచారం అందించాలని సీపీ విజ్ఞప్తి చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై గులకరాయి కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్ను కస్టడీకి అనుమతిస్తూ విజయవాడ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ప్రమాదవశాత్తు పేలిన ఏకే 47.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
ప్రమాదవశాత్తు తుపాకీ పేలడంతో సీఆర్పీఎఫ్కు చెందిన అసిస్టెంట్ కమాండెంట్ శేషగిరిరావు మృతిచెందారు. -
శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ముగ్గురి అరెస్ట్
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అనిశా మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ఆయన ఆస్తులకు బినామీలుగా ఉన్న వ్యాపారులు గోదావర్తి సత్యనారాయణమూర్తి(62), పెంట భరత్కుమార్(30), ప్రైవేటు ఉద్యోగి పెంట భరణికుమార్(30)ను వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. -
నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలు
నూడుల్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన వజ్రాలు, ప్రయాణికుల శరీర భాగాల్లో, బ్యాగేజీలో ఉంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. -
వైకాపా నాయకుడి ఇంట్లో 384 మద్యం సీసాలు
శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా నాయకుడు పైడి మహేశ్వరరావు నివాసంలో దాచి ఉంచిన 384 మద్యం సీసాలను టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురికి గాయాలు
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దంపతులు వాటిని తీర్చే దారిలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో జరిగింది. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.
తాజా వార్తలు (Latest News)
-
సభలో మాట్లాడుతూ.. స్పృహ కోల్పోయిన నితిన్ గడ్కరీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఈ బర్త్డే ఎంతో స్పెషల్.. వారి నుంచే నాకు ఫస్ట్ విషెస్: సచిన్
-
మోదీ పనితీరు అద్భుతం.. కొనియాడిన జేపీ మోర్గాన్ సీఈఓ
-
రూ. 120 కోట్లకు పైగా అక్రమార్జన.. ఎట్టకేలకు చిక్కిన స్క్రాప్ మాఫియా డాన్
-
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం