Hyderabad: బైక్పై వెళ్లి 4 గ్రనేడ్లు తెచ్చిన జాహెద్.. రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెల్లడి
ఉగ్ర కుట్ర కేసు రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక అంశాలు వెల్లడించారు. పేలుడు పదార్థాలను పాకిస్థాన్ నుంచి మహారాష్ట్రలోని మనోహరాబాద్కు ఫరాతుల్లా ఘోరి పంపినట్టు గుర్తించారు.
హైదరాబాద్: హైదరాబాద్లో భారీ విధ్వంసానికి కుట్ర పన్నిన కేసు దర్యాప్తులో పోలీసులకు సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. దాడులకు పాకిస్థాన్లో పథక రచన చేసినట్లు గుర్తించారు. ఉగ్ర కుట్ర కేసు రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక అంశాలు వెల్లడించారు. పేలుడు పదార్థాలను పాకిస్థాన్ నుంచి మహారాష్ట్రలోని మనోహరాబాద్కు ఫరాతుల్లా ఘోరి పంపినట్టు గుర్తించారు. గత నెల 28న జాహెద్కు పేలుడు పదార్థాలు అందాయి. అతనే స్వయంగా బైక్పై వెళ్లి 4 గ్రనేడ్లు తీసుకొచ్చినట్టు దర్యాప్తులో తేలింది. ఒక గ్రనేడ్ తన వద్దే ఉంచుకుని, మూడింటిని సమీరుద్దీన్, మజ్హసన్లకు అందజేశాడు.
సమీరుద్దీన్ సెల్ఫోన్తో జాహెద్ ఫరాతుల్లా గౌరీతో చాట్ చేసినట్టు గుర్తించారు. 12 ఏళ్లు జైల్లో ఉండి తిరిగొచ్చిన తర్వాత పాక్లో ఉన్న హ్యాండ్లర్ల ద్వారా ఉగ్ర కార్యకలాపాలకు జాహెద్ పథకం రచించాడు. రూ.30లక్షలకు పైగా హవాలా ద్వారా నిందితులకు నగదు చేరిందని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఆ డబ్బును జాహెద్ యువకులకు ఇచ్చి ఉగ్రవాదం వైపు ప్రేరేపించాడు. హైదరాబాద్లో జరిగే సామూహిక ఉత్సవాల్లో మజ్ హసన్, సమీయుద్దీన్, జాహెద్లు కలిసి ఒకేసారి దాడులు చేయాలని కుట్ర చేశారు. హైదరాబాద్లో మత కల్లోలాలు సృష్టించి భయోత్పాతం సృష్టించడమే నిందితుల లక్ష్యమని పోలీసులు తెలిపారు. సామూహిక దాడులతో ప్రజల్లో అనిశ్చితి నెలకొల్పి, అంతర్గత భద్రతకు ముప్పు వాటిల్లే విధంగా దాడులకు స్కెచ్ వేశారు. భారీగా ప్రాణ నష్టం కలిగేలా చేయాలని నిందితుల ప్రణాళిక అని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు బృందం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేసింది. -
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం