Robbery: ₹20లక్షలు దోపిడీ చేసి.. ‘ఐ లవ్‌ యూ’ అని రాసిపెట్టి పోయారు!

నిమాటిక్‌గా జరిగిన ఈ దొంగతనం చర్చనీయాంశంగా మారింది. ఎవరూ లేని సమయం చూసి బంగ్లా తలుపులు పగలగొట్టి లోపలికి చొరబడిన....

Published : 26 May 2022 01:26 IST

పనాజీ: గోవాలో అసాధారణ రీతిలో జరిగిన చోరీ ఘటన వెలుగులోకి వచ్చింది. సినిమాటిక్‌గా జరిగిన ఈ దొంగతనం చర్చనీయాంశంగా మారింది. ఎవరూ లేని సమయం చూసి బంగ్లా తలుపులు పగలగొట్టి లోపలికి చొరబడిన దుండగులు రూ.20లక్షల విలువ చేసే ఆభరణాలతో పాటు కొంత నగదును ఎత్తుకెళ్లారు. అంతేకాకుండా ఆ ఇంట్లో ఓ సందేశాన్ని రాసిపెట్టి ట్విస్ట్‌ ఇచ్చారు. ఈ ఘటన దక్షిణ గోవాలోని మార్గోవ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆసిబ్‌ జెక్‌ అనే వ్యక్తి రెండు రోజుల హాలిడే కోసం బయటకు వెళ్లి మంగళవారం వచ్చారు. ఇంట్లో వచ్చి చూసేసరికి రూ.20లక్షల విలువ చేసే బంగారం, వెండి ఆభరణాలు, రూ.1.5లక్షల నగదు చోరీకి గురైనట్టు గుర్తించారు. అంతేకాకుండా ఇంట్లో టీవీ స్క్రీన్‌పై ‘ఐ లవ్‌ యూ’ అని మార్కర్‌తో రాసి ఉండటాన్ని గమనించిన ఇంటి యజమాని ఒక్కసారిగా కంగుతిన్నారు. వెంటనే మార్గోవ్‌ పోలీసులకు ఈ ఘటనపై ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఇన్‌స్పెక్టర్‌ సచిన్‌ నర్వేకర్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని