Crime news: విద్యార్థి అరెస్టు.. కారణమేమిటంటే..
ఐఐటీ ఖరగ్పూర్కి బీటెక్ చదువుకోమని పంపిస్తే.. ఆ అబ్బాయి.. తప్పుదారి పట్టాడు.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 50మంది అమ్మాయిల ఫొటోలను మార్ఫింగ్ చేసి జైలుపాలయ్యాడు. వివరాల్లోకి వెళ్లితే.. పుణెకు చెందిన మహవీర్ (19) ఐఐటీ ఖరగ్పూర్లో బీటెక్ చదువుతున్నాడు. దిల్లీలోని ఓ ప్రముఖ పాఠాశాలలోని బాలికలు, ఉపాధ్యాయులనే లక్ష్యంగా చేసుకొని.. యాప్స్పై తనకున్న అవగాహనతో వారికి దగ్గరవ్వడం ప్రారంభించాడు.
దిల్లీ: ఐఐటీ ఖరగ్పూర్కి బీటెక్ చదువుకోమని పంపిస్తే.. ఆ అబ్బాయి.. తప్పుదారి పట్టాడు.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 50మంది అమ్మాయిల ఫొటోలను మార్ఫింగ్ చేసి జైలుపాలయ్యాడు. వివరాల్లోకి వెళ్లితే.. పుణెకు చెందిన మహవీర్ (19) ఐఐటీ ఖరగ్పూర్లో బీటెక్ చదువుతున్నాడు. దిల్లీలోని ఓ ప్రముఖ పాఠాశాలలోని బాలికలు, ఉపాధ్యాయులనే లక్ష్యంగా చేసుకొని.. యాప్స్పై తనకున్న అవగాహనతో వారికి దగ్గరవ్వడం ప్రారంభించాడు. దీనికోసం ఫేక్ కాలర్ ఐడీ యాప్స్తో పాటు వాట్సాప్లోని వర్చ్యూవల్ నంబర్స్ను వాడేవాడు. తనని ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు వాయిస్ ఛేంజింగ్ యాప్ వాడి మాట్లాడేవాడు. అమ్మాయిలు తనకు దగ్గరైయ్యారని తెలిశాక.. వారి ఫొటోలను అడిగి వాటిని మార్ఫింగ్ చేసి.. వారి పేర్లతో ఫేక్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి అందులో అప్లోడ్ చేసేవాడు. అలా చాలా ఫొటోలు సోషల్ మీడియా వేదికల్లో కనిపించడంతో.. అప్రమత్తమైన బుధవారం ఆ స్కూల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, వారి తల్లిదండ్రులను విచారించి.. గురువారం నిందితుడి పై పోక్సో సంబంధింత చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు డిప్యూటీ కమిషనర్ పోలీస్ సాగర్ సింగ్ కైలాశ్ తెలిపారు. దీని పై మరిన్ని వివరాలను తెలియజేస్తూ.. ‘‘ 33 వాట్సాప్ వర్చ్యువల్ నంబర్స్తో పాటు ఐదు ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్, ఫేక్ కాలర్ ఐడీ యాప్స్తో నిందితుడు అమ్మాయిలకు దగ్గరయ్యాడు. దీంతో మా టీమ్ వాట్సాప్, ఇన్స్టా, ఫేక్మెయిల్ ఐడీకి ఐపీ లాగిన్ ఐడీ వివరాలను దర్యాప్తు చేయగా.. అవి బిహార్లోని పట్నాకు చెందిన మహవీర్ అని తేలింది. వెంటనే అతడిని అరెస్టు చేసి అతడి వద్ద ఉన్న ఫొటోలు, ల్యాప్టాప్స్ని సీజ్ చేశాం’’ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు బృందం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేసింది. -
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
లండన్లో ఖలిస్థానీ అనుకూలవాదుల దుశ్చర్య కేసు.. కీలక నిందితుడి అరెస్టు
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట