Andhra News: వైకాపా నేత కారులో రూ.20లక్షల విలువైన అక్రమ మద్యం
వైకాపా నాయకుడి కారు నుంచి భారీగా కర్ణాటక మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.20లక్షలకు పైగా ఉంటుందని అధికారుల అంచనా.
ఖాజీపేట: వైఎస్ఆర్ జిల్లా ఖాజీపేట వద్ద వైకాపా నాయకుడి కారు నుంచి భారీగా మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బ్రహ్మంగారిమఠం మండలానికి చెందిన సోషల్ మీడియా కన్వీనర్ శివరామ్ కారు నుంచి 50 కేసుల కర్ణాటక మద్యాన్ని టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు నుంచి అక్రమంగా కర్ణాటక మద్యాన్ని బ్రహ్మంగారి మఠానికి తరలిస్తుండగా సమాచారం అందుకున్న పోలీసులు ఖాజీపేట వద్ద తనిఖీలు చేసి కారులో ఉన్న మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ కారులో శివరామ్ దంపతులు కూడా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. శివరామ్ దంపతులను కడప ఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లి రహస్యంగా విచారిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న మద్యం విలువ రూ.20లక్షలకు పైగా ఉంటుందని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Chandrababu: జగన్ ప్రోద్భలంతోనే సభలో మా ఎమ్మెల్యేలపై దాడి: చంద్రబాబు
-
Sports News
MS Dhoni : ధోనీ బటర్ చికెన్ ఎలా తింటాడంటే.. ఆసక్తికర విషయాలు చెప్పిన ఉతప్ప
-
India News
Amritpal Singh: అమృత్పాల్కు దుబాయ్లో బ్రెయిన్వాష్.. జార్జియాలో శిక్షణ..!
-
Politics News
Mamata Banerjee: ఆయన విపక్షాలను నడిపిస్తే.. మోదీని ఎదుర్కోలేం..!
-
Movies News
Kangana Ranaut: ఎలాన్ మస్క్ ట్వీట్.. సినిమా మాఫియా తనని జైలుకు పంపాలనుకుందంటూ కంగన కామెంట్
-
General News
Delhi liquor case: ఈడీ ఎదుట విచారణకు హాజరైన ఎమ్మెల్సీ కవిత