Robbery: కుమారుడికే కత్తి పెట్టి.. దోపిడీకి యత్నించి..!
అనుకోకుండా సొంత కుమారుడినే దోచుకునేందుకు యత్నించాడో తండ్రి. స్కాట్లాండ్లోని గ్లాస్గోలో ఇది చోటుచేసుకుంది. ఈ ఘటనలో నేరస్థుడికి 26 నెలల జైలుశిక్ష పడింది.
లండన్: తేలికగా డబ్బు సంపాదించాలి అనుకున్న ఓ వ్యక్తి.. అనుకోకుండా సొంత కొడుకునే దోచుకునేందు(Robbery)కు యత్నించి జైలు పాలైన ఘటన ఇది. స్కాట్లాండ్(Scotland)లోని గ్లాస్గో(Glasgow)లో చోటుచేసుకుంది. ఓ 17 ఏళ్ల యువకుడు స్థానికంగా ఓ ఏటీఎంకు వెళ్లి నగదు తీసుకున్నాడు. అంతలోనే ముసుగు ధరించిన ఓ వ్యక్తి లోపలికి ప్రవేశించి.. అతన్ని వెనుకనుంచి అదిమి పట్టి, మెడపై కత్తి పెట్టాడు. నగదు ఇవ్వాలంటూ బెదిరించాడు. అయితే, నిందితుడి గొంతును గుర్తుపట్టిన యువకుడు.. వెంటనే అతన్ని తన తండ్రిగా గుర్తించాడు. ‘నిజంగా ఈ పని చేస్తున్నారా? నన్ను గుర్తుపట్టారా?’ అని ప్రశ్నించాడు.
అయితే, ఇవేమీ పట్టించుకోనని నిందితుడు చెప్పాడు. ఈ క్రమంలోనే వెనుకకు తిరిగిన యువకుడు.. తండ్రి ముసుగును లాగేశాడు. దీంతో ఇప్పటివరకు తాను కత్తి పెట్టింది తన బిడ్డకేనని తెలుసుకొని తండ్రి షాక్ తిన్నాడు! నిస్సహాయ స్థితిలో ఈ పని చేయాల్సి వచ్చిందని చెబుతూ.. క్షమించమని కోరాడు. మరోవైపు.. ఆ యువకుడు వెంటనే అక్కడి నుంచి పారిపోయి జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు, పోలీసులకు చెప్పాడు. తానే ఈ నేరానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో అంగీకరించిన తండ్రి.. ఏటీఎం వద్ద ఉన్నది తన కుమారుడన్న విషయం తెలియలేదన్నాడు. ఈ కేసులో అతనికి 26 నెలల జైలు శిక్ష పడినట్లు అధికారులు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
పుత్తూరులో భారీ మద్యం డంప్ స్వాధీనం
తిరుపతి జిల్లా పుత్తూరులో భారీ మద్యం డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం కేసులను వైకాపా నాయకులు ప్రైవేటు కళాశాలలో డంప్ చేసినట్లు గుర్తించారు. -
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
మధ్యాహ్నం 3 గంటల వరకు 50%పోలింగ్.. అత్యధికంగా ఈ రాష్ట్రంలో..
-
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
-
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్
-
4 రోజుల నష్టాలకు బ్రేక్.. 599 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
-
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు