కీచక గురువు: 13 మంది బాలికల్ని రేప్ చేసిన స్కూల్ ప్రిన్సిపల్కు జీవిత ఖైదు!
పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి సమాజంలో ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన గురువే వారి జీవితాల్ని సర్వనాశనం చేశాడు. మానవ రూపంలో ఉన్న మృగంలా మారిన ఓ కీచక ప్రిన్సిపల్.. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. 13మంది.....
బాలికలను గర్భవతుల్ని చేసిన ఓ మానవ మృగానికి జైలు శిక్ష
బాండుంగ్: పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి సమాజంలో ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన గురువే వారి జీవితాల్ని సర్వనాశనం చేశాడు. మానవ రూపంలో ఉన్న మృగంలా మారిన ఓ కీచక ప్రిన్సిపల్.. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. 13మంది విద్యార్థునులపై అత్యాచారం చేశాడు. సభ్యసమాజం ఏమనుకుంటుందోనన్న కనీస విచక్షణ కూడా లేకుండా బాలికల్ని రేప్ చేసి వారిలో కొందరిని గర్భవతుల్ని చేసిన ఈ మృగానికి కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ ఘటన ఇండోనేషియా పశ్చిమ జావాలోని బాండుంగ్ నగరంలో ఓ ఇస్లామిక్ బోర్డింగ్ పాఠశాలలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
2016 నుంచి 2021 మధ్య కాలంలో 11-14 ఏళ్ల వయస్సున్న కనీసం 13 మంది బాలికలపై ప్రిన్సిపల్ హెర్రీ విరావాన్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పాఠశాలలోనే కాకుండా బయట హోటల్ గదులు, అద్దె అపార్టమెంట్లలో వారిని బెదిరించి అఘాయిత్యం చేసినట్టు నేరారోపణలు వచ్చాయి. అతడు చేసిన పాపానికి ఎనిమిది మంది శిశువులు కూడా పుట్టారు. ఇంకా అనేకమంది బాధితులు పోలీసు కేసులతో మళ్లీ ఇబ్బందులు పడాల్సి వస్తుందనే భయంతో ఫిర్యాదు చేయడంలేదని పోలీసులు చెబుతున్నారు. ఓ బాధితురాలు సెలవులకు ఇంటికి వచ్చి ఆ తర్వాత ఓ ఆస్పత్రిలో చేరి బిడ్డకు జన్మినివ్వడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసుల్ని ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పశ్చిమ జావా పోలీసులు గతేడాది మే నెలలోనే నిందితుడిని అరెస్టు చేసి విచారణ ప్రారంభించారు. విచారణ సందర్భంగా నిందితుడు తన నేరాలను అంగీకరించడంతో పాటు బాధిత విద్యార్థినులు, వారి కుటుంబ సభ్యులకు క్షమాపణలు చెప్పాడని పోలీసులు వెల్లడించారు. అయితే, ఈ వ్యవహారంపై గత నవంబర్లో కోర్టులో విచారణ ప్రారంభమయ్యేంత వరకు కేసు సమాచారాన్ని పోలీసులు బయటకు రానివ్వలేదు. బాధితులకు మానసికంగా, సామాజికంగా జరిగే నష్టాన్ని నివారించేందుకే తాము ఈ విషయాన్ని బయటపెట్టలేదని పోలీసులు తెలిపారు.
బాండుంగ్ జిల్లా కోర్టులోని ముగ్గురు న్యాయమూర్తుల ప్యానల్ నిందితుడిని దోషిగా తేల్చింది. అతడికి జీవిత ఖైదు విధించింది. బాధితులకు 23,200 డాలర్లు పరిహారం ఇవ్వాలని మహిళా సాధికారత, శిశు సంరక్షణ మంత్రిత్వశాఖను ఆదేశించింది. వీటిలో ఒక్కో బాలిక వైద్య, మానసిక చికిత్స కోసం 600 నుంచి 6వేల డాలర్లు ఇవ్వాలని సూచించింది. నిందితుడు ఉద్దేశపూర్వకంగానే ఈ దారుణానికి పాల్పడినట్టు న్యాయమూర్తులు ఆగ్రహం వ్యక్తంచేశారు. పిల్లలకు చదువు చెప్పడానికి బదులు వారితో లైంగిక కార్యకలాపాల కోసం బెదిరించి హింసకు గురిచేశాడన్నారు. కొందరు బాలికలు జన్మనిచ్చిన తొమ్మిది మంది శిశువులను మహిళా శిశు సంరక్షణ ఏజెన్సీకి అప్పగించాలని కోర్టు ఆదేశించింది. ఆ బాలికలు శిశువుల్ని పెంచగలమనే మానసిక సంసిద్ధత వ్యక్తంచేసే వరకు వారి సంరక్షణలోనే ఉంచాలని సూచించింది. అయితే, 13మంది విద్యార్థినుల జీవితాల్ని నాశనం చేసిన నిందితుడికి మరణశిక్షతో పాటు లైంగిక సామర్థ్యాన్ని నిర్వీర్యం చేసేలా తీర్పు ఇవ్వాలని న్యాయవాదులు కోరగా.. అందుకు న్యాయస్థానం అంగీకరించలేదు. మరోవైపు, ఈ తీర్పును ఎగువ కోర్టులో అప్పీల్ చేసుకోవాలా, వద్దా అనే అంశంపై ఆలోచిస్తున్నట్టు నిందితుడి తరఫు న్యాయవాదులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్