Andhra News: గూడూరులో విషాదం.. గుండెపోటుతో ఇంటర్‌ విద్యార్థి మృతి!

తిరుపతి జిల్లా గూడూరులో విషాదం చోటు చేసుకుంది.

Updated : 10 May 2022 12:31 IST

గూడూరు గ్రామీణ: తిరుపతి జిల్లా గూడూరులో విషాదం చోటు చేసుకుంది. గుండెపోటుతో ఇంటర్‌ విద్యార్థి మృతిచెందాడు. గూడూరులోని డీఆర్‌డబ్ల్యూ కళాశాల పరీక్ష కేంద్రం విద్యార్థి ఒక్కసారిగా కుప్పకూలాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో విద్యార్థి సతీష్‌(17) మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సైదాపురం మండలం కమ్మవారిపల్లె గ్రామానికి చెందిన ఏకోలు శ్రీనివాసులు కుమారుడు సతీష్‌ గూడూరు పట్టణంలో స్వర్ణాంధ్రభారతి కళాశాలలో చదువుతున్నాడు. ప్రస్తుతం ఇంటర్‌ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో రోజూ స్వగ్రామం నుంచి గూడూరులోని పరీక్ష కేంద్రానికి వచ్చాడు.

పరీక్షకు ముందు పరీక్ష కేంద్రం బయట కూర్చున్న సమయంలో విద్యార్థికి ఒక్కసారిగా చమటలు పట్టి కుప్పకూలిపోయాడు. తోటి విద్యార్థులు అక్కడ విధుల్లో ఉన్న పోలీసులకు విషయం చెప్పడంతో వారు వెంటనే గూడూరు ప్రభుత్వ వైద్యశాలకు విద్యార్థిని తరలించారు. అప్పటికే విద్యార్థి మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ విషయాన్ని విద్యార్థి తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు గూడూరు చేరుకున్నారు. కుమారుడి మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. విద్యార్థి గుండెపోటుతో చనిపోయినట్లు ప్రాథమికంగా తెలిపిన వైద్యులు.. తల్లిదండ్రులతో మాట్లాడిన అనంతరం విద్యార్థి మృతికి కారణాలు తెలియజేయనున్నారు. ఈ మేరకు గూడూరు పట్టణ ఎస్‌ఐ పవన్‌కుమార్‌ కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు. 
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని