Khammam: వామ్మో సూదిమందు.. భయపడి ఆటోలోంచి దూకిన ఇంటర్‌ విద్యార్థి

ఆటోలో సూదిమందు చర్చ జరుగుతుండగా భయపడిన యువకుడు అందులోంచి దూకి గాయాలపాలైన ఘటన ఖమ్మం జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. బాధితుడు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నేలకొండపల్లి మండలం

Updated : 23 Sep 2022 07:44 IST

నేలకొండపల్లి, న్యూస్‌టుడే: ఆటోలో సూదిమందు చర్చ జరుగుతుండగా భయపడిన యువకుడు అందులోంచి దూకి గాయాలపాలైన ఘటన ఖమ్మం జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. బాధితుడు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నేలకొండపల్లి మండలం అజయ్‌తండాకు చెందిన బానోత్‌ గోపి నేలకొండపల్లిలో ఇంటర్‌ చదువుతున్నాడు. కళాశాలకు వెళ్లేందుకు అజయ్‌తండాలో చెరువుమాదారం నుంచి వస్తున్న ఓ ఆటో ఎక్కాడు. ఆటోలో ఓ వ్యక్తి, వృద్ధుడు, బాలుడు ఉన్నారు. బాలుడు వెనుక సీటులో పడుకొని ఉన్నాడు. డ్రైవరుకు ఆటోలో ఉన్న వ్యక్తికి మధ్య సూది ఘటనపై చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో వారిని చూసి భయపడిన గోపి ఆటో ఆపాలని అభ్యర్థించాడు. వారు ఆపకుండా అలాగే వెళ్లడంతో ‘వెనుక ఉన్న బాలునికి సూది వేసి పడుకోబెట్టి ఉండొచ్చు, నాకు కూడా సూది వేస్తారేమో’నని అనుమానపడ్డాడు. అదే సమయంలో వృద్ధుడు సంచిలో చేయి పెట్టాడు. వారు కచ్చితంగా తనకు సూదిమందు వేస్తారని భయపడి ఆటో నుంచి దూకాడు. దీంతో ఆటో కూడా పల్టీ కొట్టింది. గోపికి గాయాలయ్యాయి. అక్కడ నుంచి పారిపోయి అజయ్‌తండా చేరుకొన్నాడు. ప్రస్తుతం గోపి ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు స్థానిక ఠాణాలో ఫిర్యాదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని