Uttarpradesh: మందలించాడని ఆగ్రహం.. ప్రిన్సిపల్పై విద్యార్థి కాల్పులు!
తనను మందలించాడన్న కోపంతో ఓ విద్యార్థి ఏకంగా ప్రిన్సిపల్పై నాటు తుపాకీతో కాల్పులకు దిగాడు. ఉత్తర్ప్రదేశ్(Uttar pradesh)లోని సీతాపుర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ....
ఉత్తర్ప్రదేశ్లోని సీతాపుర్లో ఘటన
లఖ్నవూ: తక్కువ మార్కులు వేశారన్న కారణంతో ఇటీవల ఝార్ఖండ్లో ఓ ఉపాధ్యాయుడిని, క్లర్క్ను విద్యార్థులు చెట్టుకు కట్టి కొట్టారు. ఈ ఘటనను మరవకముందే.. తనను మందలించాడన్న కోపంతో ఓ విద్యార్థి ఏకంగా ప్రిన్సిపల్పై నాటు తుపాకీతో కాల్పులకు దిగాడు. ఉత్తర్ప్రదేశ్(Uttar pradesh)లోని సీతాపుర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. మరోవైపు.. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. సీతాపుర్ పోలీసుల వివరాల ప్రకారం.. సదర్పుర్ ఠాణా పరిధిలోని ఓ కళాశాలలో శుక్రవారం ఇద్దరు ఇంటర్ విద్యార్థుల మధ్య గొడవ జరిగింది. ప్రిన్సిపల్ జోక్యం చేసుకుని వారిద్దరిని మందలించారు.
దీంతో.. ఇద్దరిలో ఓ విద్యార్థి శనివారం నాటు తుపాకీతో కళాశాలలో ప్రిన్సిపల్పై కాల్పులకు దిగాడు. తీవ్ర గాయాలపాలైన బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రమాదమేమి లేదని స్థానిక ఏఎస్పీ రాజీవ్ దీక్షిత్ వెల్లడించారు. మెరుగైన చికిత్స కోసం ఆయన్ను లఖ్నవూకు తరలించినట్లు చెప్పారు. నిందితుడి ఆచూకీ కోసం గాలిస్తున్నామన్నారు. సీసీటీవీ కెమెరాలో ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు నిక్షిప్తమయ్యాయి. చేతిలో నాటు తుపాకీతో ప్రిన్సిపల్పై దాడి చేయడం, ఇద్దరు పెనుగులాడటం, ఈ క్రమంలోనే అక్కడున్న వారు వచ్చి విద్యార్థిని పట్టుకోవడం వంటి దృశ్యాలు రికార్డయ్యాయి. అయితే, మందలించినందుకుగానూ ఆ విద్యార్థి ఇంతకు తెగిస్తాడని తనకు తెలియదని బాధితుడు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ముగ్గురి అరెస్ట్
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అనిశా మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ఆయన ఆస్తులకు బినామీలుగా ఉన్న వ్యాపారులు గోదావర్తి సత్యనారాయణమూర్తి(62), పెంట భరత్కుమార్(30), ప్రైవేటు ఉద్యోగి పెంట భరణికుమార్(30)ను వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. -
నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలు
నూడుల్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన వజ్రాలు, ప్రయాణికుల శరీర భాగాల్లో, బ్యాగేజీలో ఉంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. -
వైకాపా నాయకుడి ఇంట్లో 384 మద్యం సీసాలు
శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా నాయకుడు పైడి మహేశ్వరరావు నివాసంలో దాచి ఉంచిన 384 మద్యం సీసాలను టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురికి గాయాలు
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దంపతులు వాటిని తీర్చే దారిలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో జరిగింది. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.
తాజా వార్తలు (Latest News)
-
విదేశాలకు వెళ్లాల్సింది.. అనంతలోకాలకు..
-
ఎండలో తిరుగుతున్నారా.. జాగ్రత్త!
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 ఎగువనే నిఫ్టీ
-
నా జీవితాన్ని నాశనం చేసింది నువ్వే.. వైకాపా ఎమ్మెల్యే భార్యను నిలదీసిన మహిళ
-
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్
-
బస్సులో సీఎం... ఎండలో జనం