Women Suicide: భర్త ఇంట్లో మరుగుదొడ్డి లేదని మహిళ ఆత్మహత్య

ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకున్న ఓ అమ్మాయి అత్తింట్లో కనీస అవసరాలు లేవని తెలిసి తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇకపై తను ఉండాల్సిన చోట మరుగుదొడ్డి లేదని ఆ నూతన వధువు తనువు చాలించింది.

Published : 10 May 2022 19:28 IST

చెన్నై: ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకున్న ఓ అమ్మాయి అత్తింట్లో కనీస అవసరాలు లేవని తెలిసి తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇకపై తను ఉండాల్సిన చోట మరుగుదొడ్డి లేదన్న వేదనతో ఆ నూతన వధువు తనువు చాలించింది. తమిళనాడులో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అరిసిపెరియకుప్పం గ్రామానికి చెందిన రమ్య(27) ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తోంది. ఆమెకు ఏప్రియల్‌ 6న కార్తికేయన్‌ అనే వ్యక్తితో వివాహమైంది. అయితే వివాహం అనంతరం తన భర్త ఇంట్లో మరుగుదొడ్డి లేదని తెలిసి రమ్య తన పుట్టింట్లోనే ఉంది. మరుగుదొడ్డి ఉన్న ఇల్లు తీసుకోవాలని భర్తకు చెప్పింది. ఈ విషయమై కొన్ని రోజుల నుంచి ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో సోమవారం రమ్య ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అది గమనించిన రమ్య తల్లి మంజుల హుటాహుటిన  ఆమెను  ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.   రమ్య చికిత్స పొందుతూ మరణించింది. రమ్య తల్లి మంజుల ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని