‘మోసగాళ్లు’లాగే మోసగించారు!
గతంలో జరిగిన ఓ ఐటీ కుంభకోణం నేపథ్యంలో ఇటీవల ‘మోసగాళ్లు’ సినిమా విడుదలై విషయం తెలిసిందే. కాజల్, మంచు విష్ణు ప్రధాన పాత్రలు పోషించారు. ఇందులో అక్కాతమ్ముడిగా నటించిన వీరిద్దరు ఓ నకిలీ కాల్సెంటర్ ద్వారా అమెరికన్ల నుంచి రూ.2,600కోట్లు
ఇంటర్నెట్ డెస్క్: గతంలో జరిగిన ఓ ఐటీ కుంభకోణం నేపథ్యంలో ఇటీవల ‘మోసగాళ్లు’ సినిమా విడుదలై విషయం తెలిసిందే. కాజల్, మంచు విష్ణు ప్రధాన పాత్రలు పోషించారు. ఇందులో అక్కాతమ్ముడిగా నటించిన వీరిద్దరు ఓ నకిలీ కాల్సెంటర్ ద్వారా అమెరికన్ల నుంచి రూ.2,600కోట్లు దోచుకుంటారు. దిల్లీలోనూ ఓ ముఠా అచ్చం అదే విధంగా అమెరికన్లతోపాటు కెనడియన్లనూ మోసం చేసి రూ.కోట్లు కొల్లగొట్టింది. తాజాగా దిల్లీ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ ముఠాలోని 34 మందిని అరెస్టు చేశారు. వారు చెప్పిన కథనం ప్రకారం..
దిల్లీలోని ఉత్తమ్నగర్లో ఓ ముఠా విదేశీయులే లక్ష్యంగా ఒక కాల్సెంటర్ ఏర్పాటు చేసింది. యూఎస్ డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ అధికారులమంటూ ఈ కాల్ సెంటర్ సిబ్బంది అమెరికా, కెనడా ప్రజలకు ఫోన్ చేసేవారు. ‘మీ బ్యాంక్ ఖాతాలోని డబ్బుతో మెక్సికోలో డ్రగ్స్ కొనుగోలుకు లావాదేవీలు జరిగాయని, ఈ నేరం కింద పోలీసులు మిమ్మల్ని అరెస్టు చేయబోతున్నారు’అని భయపెట్టేవారు. ఈ నేరం నుంచి తప్పించుకునేందుకు బాధితులు బిట్కాయిన్ లేదా గూగుల్ గిఫ్ట్ ద్వారా ఈ ముఠాకు డబ్బులు పంపించేవారు. అంతేకాదు.. మెకాఫీ, యాపిల్ టెక్నికల్ సపోర్ట్ నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి.. బాధితుల ఫోన్లు హ్యాక్కు గురయ్యానని నమ్మించేవారు. వాటిని సరి చేయాలంటే ఖర్చు అవుతుందని డబ్బులు వసూలు చేశారు. అలా గత మూడేళ్లలో అమెరికా, కెనడాకు చెందిన దాదాపు 8వేల మంది నుంచి రూ.10కోట్లు దోచుకున్నట్లు పోలీసులు తెలిపారు. సరైన అనుమతులు లేకుండా కాల్ సెంటర్స్ నడుస్తున్నాయని సమాచారం రావడంతో స్పెషల్ సెల్ పోలీసులు దాడి చేసి.. విచారణ జరపగా ఈ మోసగాళ్ల బండారం బయటపడింది. ఈ కేసులో ప్రధాన నిందితులు క్షితిజ్ బాలి, అభిషేక్, ధనంజయ్ నేగి సహా 34 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు బృందం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేసింది. -
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?