లోయలో పడిన జీపు: ముగ్గురి మృతి

మండి జిల్లా కషౌట్‌ వద్ద శనివారం రాత్రి జీపు లోయలో పడింది. ఈ సంఘటనలో ముగ్గురు మృతి చెందగా, 11 మందికి గాయాలు అయ్యాయి. ఈ విషయాన్ని ఆ జిల్లా అదనపు ఎస్పీ ఆశీష్‌ శర్మ

Updated : 21 Feb 2021 01:40 IST

హిమాచల్‌ప్రదేశ్‌: మండి జిల్లా కషౌట్‌ వద్ద శనివారం రాత్రి జీపు లోయలో పడింది. ఈ సంఘటనలో ముగ్గురు మృతి చెందగా, 11 మందికి గాయాలు అయ్యాయి. ఈ విషయాన్ని ఆ జిల్లా అదనపు ఎస్పీ ఆశీష్‌ శర్మ ధ్రువీకరించారు. ప్రమాదం జరిగిన వెంటన సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి వెళ్లి సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వెంటనే  సమీప ఆసుపత్రికి తరలించినట్లు హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి జైరామ్‌ ఠాకూర్‌ ట్వీట్‌ చేశారు. 
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని