జర్నలిస్టుకు ₹40వేలు టోకరా.. హిప్నటైజ్ చేసి మరీ డబ్బులు కొట్టేశారా!?
Hypnotise: దిల్లీలో ఓ కొత్త సైబర్ నేరం వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తనను హిప్నటైజ్ చేసి మరీ డబ్బులు కొట్టేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అందుకు ఆస్కారం లేదని పోలీసులు కొట్టిపారేశారు.
దిల్లీ: దేశంలో సైబర్ నేరాలు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. కొందరు సైబర్ నేరగాళ్లు బ్యాంకు అధికారిలా ఫోన్ చేసి డబ్బులు కొట్టేస్తే.. ఇంకొకరు లింకులు పంపించి సొమ్ము కాజేస్తుంటారు. ఇప్పటి వరకు చూసిన సైబర్ నేరాలన్నీ దాదాపు ఈ కోవకు చెందినవే. అయితే, ఒక వ్యక్తిని హిప్నటైజ్ చేసి మరీ డబ్బులు కొట్టేయడం ఇప్పటి వరకు జరగలేదు! అదీ ఫోన్లో! కానీ, తన విషయంలో అదే జరిగిందంటున్నాడు దిల్లీకి చెందిన ఓ వ్యక్తి!! ఫోన్లో మాటలతో తనను హిప్నటైజ్ చేసి మరీ డబ్బు కొట్టేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే, అది హిప్నటైజ్ కాదని పోలీసులు పేర్కొనడం గమనార్హం.
దిల్లీలో రమేశ్ కుమార్ రాజా అనే ఓ జర్నలిస్టు తాను హిప్నటైజ్కు గురై రూ.40 వేలు పోగొట్టుకున్నానంటూ ఏప్రిల్ 25న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి అతడికి నేను బాగా తెలిసినట్లుగా మాట్లాడాడు. అప్పటికీ తాను ఎవరో నాకు తెలీదు అని చెప్పినా వినిపించుకోలేదు. తీరా నా స్నేహితుడి గొంతులా ఉండటంతో నేనూ నమ్మా. తర్వాత ఇద్దరి మధ్య మాటలు కలిశాయి. ఆ సందర్భంలో ఎవరికో డబ్బు పంపాలని అతడు నాకు చెప్పారు. అయితే అతడికి ఆన్లైన్ పేమెంట్ సదుపాయం లేకపోవడంతో నా అకౌంట్లో వేస్తాననడంతో అందుకు ఓకే చెప్పా. అతడు సాయంత్రం నా దగ్గర తీసుకుంటాడని చెప్పాడు. అలా నన్ను మాటల్లో ముంచి తనకు తెలీకుండానే రెండుసార్లు పేటీఎం ద్వారా నా బ్యాంక్ ఖాతా నుంచి రూ.20వేలు చొప్పున రెండు సార్లు డబ్బు కాజేశాడు’’ అని రాజా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అవతలి వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు హిప్నటైజ్కు గురై అతడు చెప్పిన సూచనలన్నీ పాటించానని చెప్పుకొచ్చాడు.
‘‘అవతలి వ్యక్తి తొలుత ఖాతా యాక్టివ్గా ఉందో లేదో అని మొదట రూ.2 పంపుతానని అన్నాడు. అతను పంపిన పేటీఎం సందేశాన్ని తెరిచి పిన్ ఎంటర్ చేస్తే.. నా ఎస్బీఐ ఖాతా నుంచి రూ.2 కట్ అయ్యాయి. అదే విషయం అతడికి చెప్పా. జరిగిన పొరపాటుకు క్షమాపణలు చెప్పి నాకు రూ.4 పంపాడు. తర్వాత రూ.20వేలు పంపుతున్నానని పేటీఎంలో సందేశం పంపాడు. అంతకుముందులానే పిన్ ఎంటర్ చేశా. ఇలా రెండుసార్లు జరిగింది. కాసేపటికి రూ.40 వేలు కట్ అయిన విషయం తెలుసుకునేలోగా.. అవతలి వ్యక్తి ఫోన్ కట్ చేశాడు’’ రాజా పేర్కొన్నాడు.
సైబర్ మోసానికి గురయ్యాడని గ్రహించిన రాజా తొలుత ఎస్బీఐ, పేటీఎం సంస్థలకు లేఖ రాశాడు. అనంతరం ఉత్తర దిల్లీ సైబర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశాడు. మాటల సందర్భంలో తనను హిప్నటైజ్ చేశారని పేర్కొన్నాడు. అయితే, రాజా వాదనను పోలీసులు తోసిపుచ్చారు. బాగా తెలిసిన వ్యక్తిలా మట్లాడి, స్నేహపూర్వకంగా చాట్ చేశాక ఇలా మోసం చేసిన ఘటనలు చాలా ఉన్నాయని తెలిపారు. ఇక్కడ హిప్నటైజ్కు ఆస్కారం లేదని చెప్పారు. అయినా ఫోన్లో ఇలా హిప్నటైజ్ చేయడం కుదరదని హిప్నాటిజంలో 30 ఏళ్లు అనుభవం ఉన్న ఓ వ్యక్తి తెలిపారు. స్నేహపూర్వకంగా మెసులుతూ మోసాలు చేయడం కొత్త రకమైన నేరమని సైబర్ నిపుణులు అంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
Crime News: తమ పొరుగునే ఉంటున్న వ్యక్తి చేతిలో ఓ యువతి లైంగిక దోపిడీకి గురైంది. శారీరకంగా హింస అనుభవించింది. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
పుత్తూరులో భారీ మద్యం డంప్ స్వాధీనం
తిరుపతి జిల్లా పుత్తూరులో భారీ మద్యం డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం కేసులను వైకాపా నాయకులు ప్రైవేటు కళాశాలలో డంప్ చేసినట్లు గుర్తించారు. -
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!