Crime News: జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్... ఎట్టకేలకు ఇన్నోవా కారు స్వాధీనం?
జూబ్లీహిల్స్లో 17ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం కేసు పోలీసులకు సవాల్గా మారింది. ఇందులో పెద్దల ప్రమేయం ఉండటం వల్లే కేసు దర్యాప్తు సరిగా జరగడం లేదని విపక్షాలు ఆందోళనకు దిగడంతో ఈ కేసు మరింత సంచలనంగా మారింది. ఘటనకు సంబంధించి...
ఇంటర్నెట్ డెస్క్: జూబ్లీహిల్స్లో 17ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం కేసు పోలీసులకు సవాల్గా మారింది. ఇందులో పెద్దల ప్రమేయం ఉండటం వల్లే కేసు దర్యాప్తు సరిగా జరగడం లేదని విపక్షాలు ఆందోళనకు దిగడంతో ఈ కేసు మరింత సంచలనంగా మారింది. ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ముగ్గురు మైనర్లు, ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటికీ ఇంకా ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమ్నీషియా పబ్లో మే 28న పార్టీ ఇచ్చింది ఎవరు? బాలికను తీసుకెళ్లిన ఇన్నోవా కారు ఎవరిది? ఇన్నోవా కారులో బాలికపై సామూహిక అత్యాచారం జరిగితే రెడ్ కలర్ మెర్సిడెస్ బెంజ్ కారును పోలీసులు ఎందుకు స్వాధీనం చేసుకున్నారు? ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు కానీ, ఇన్నోవా కారు ఎక్కడుంది? అనే సందేహాలను ఇప్పటివరకు పోలీసులు నివృత్తి చేయలేకపోయారు. శనివారం సాయంత్రం నగరశివారులోని మొయినాబాద్ ప్రాంతంలో నిందితులు ఘాతుకానికి ఉపయోగించిన ఇన్నోవా కారును పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. అత్యాచార ఘటన కారులోనే జరగడంతో ఈకేసులో ఇన్నోవా కారు కీలక ఆధారం కానుంది. ఎమ్మెల్యే కుమారుడు... ఘటన జరక్కముందే అక్కడి నుంచి వెళ్లిపోయాడని స్పష్టంగా చెబుతున్న పోలీసులు ఇన్నోవా కారు ఎవరిదనే విషయంపై మాత్రం ఇంకా స్పష్టత ఇవ్వలేదు.
ఈ కేసుకు సంబంధించి భాజపా ఎమ్మెల్యే రఘునందన్రావు.. కొన్ని వీడియోలు, ఫొటోలు మీడియాకు విడుదల చేయడం కలకలం రేపింది. రఘునందన్కు ఆ దృశ్యాలు ఎలా లభించాయనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మరో వైపు ఘాతుకం జరిగిన ఇన్నోవా కారు ప్రభుత్వ వాహనంగా పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కారును గుర్తించినట్టు సమాచారం. ప్రస్తుతం ఓ రహస్య ప్రదేశంలో పట్టుబడ్డ ఇద్దరు నిందతులను విచారిస్తున్న పోలీసులకు మరిన్ని కొత్త విషయాలు తెలిసే అవకాశముందని భావిస్తున్నారు. ఇన్నోవా కారు ప్రభుత్వ వాహనమైతే ఈకేసు మరి కొందరి మెడకు చుట్టుకునే అవకాశముందని భావిస్తున్నారు.
అత్యాచారం జరిగింది ఇన్నోవా కారులోనే: పోలీసులు
జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 36లోని అమ్నీషియా పబ్లో మే 28న మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 6 గంటల వరకు ఒక బృందం మద్యం రహిత (నాన్ లిక్కర్ ఈవెంట్) వేడుకను నిర్వహించింది. ఇందులో 150 మంది పాల్గొన్నారు. వీరిలో 80 శాతానికి పైగా మైనర్లే. వారిలో ఒక బాలిక పబ్లో పరిచయమైన స్నేహితులతో సరదాగా గడిపింది. సాయంత్రం 5.45 గంటల ప్రాంతంలో ఒక బాలుడు (16), మిగిలిన స్నేహితులతో కలిసి కిందకు వచ్చింది. వారిలో ప్రభుత్వ సంస్థ ఛైర్మన్ కుమారుడు, ఒక ఎమ్మెల్యే కుమారుడు, మరికొందరు ఉన్నారు. వారు బాలికను బెంజి కారులో ఎక్కించుకుని.. బంజారాహిల్స్లోని ఓ బేకరీ వద్దకు వెళ్లారు. అక్కడ అరగంట పాటు సరదాగా గడిపారు. వేరే కారులో ఇంట్లో దింపుతామంటూ ప్రభుత్వ సంస్థ ఛైర్మన్ కుమారుడు బాలికకు చెప్పాడు. ఆమెను వెంటబెట్టుకుని 6.30 గంటల ప్రాంతంలో అతడు, మరో అయిదుగురు ఇన్నోవా వాహనంలో బయలుదేరారు. మధ్యలో ఎమ్మెల్యే కుమారుడు దిగి వెళ్లిపోయినట్లు సీసీ కెమెరాల్లో దృశ్యాలను పోలీసులు గుర్తించారు. మిగిలిన అయిదుగురు ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి కారులోనే అత్యాచారం చేశారని పోలీసులు తెలిపారు. అనంతరం నిందితులు బాధితురాలిని అమ్నీషియా పబ్ వద్ద దింపేసి వెళ్లారు.
రంగంలోకి అబ్కారీ శాఖ..
జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనపై ఆబ్కారీ శాఖ ఆరా తీస్తోంది. మైనర్లను పబ్లోకి అనుమతించకూడదని నిబంధనలు ఉన్నప్పటికీన వారిని ఎలా అనుమతించారని ప్రతి పక్షాలు ప్రశ్నిస్తున్న నేపథ్యంలో ఆబ్కారీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. మైనర్లను పబ్లోకి ఎలా అనుమతించారనే విషయంపై ఆరా తీశారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించడంతోపాటు పబ్ యాజమాన్యం నుంచి వివరాలు సేకరించారు. ఓ కార్పొరేట్ స్కూల్ పేరుతో ఉస్మాన్ అనే విద్యార్థి ఫేర్వెల్ పార్టీకి అనుమతి తీసుకున్నట్లు తెలిసింది. 150 మంది విద్యార్థుల కోసం పబ్ బుక్ చేశారు. పార్టీ కోసం పబ్కు రూ.2 లక్షలు చెల్లించారు. దీంతో భవనంలోని నాలుగో అంతస్తులో పార్టీ నిర్వహణకు పబ్ యాజమాన్యం అనుమతి ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు. అయితే, మద్యం సరఫరా చేసినట్లు ఎక్కడా ఆధారాలు లేవని, కూల్ డ్రింక్లు మాత్రమే సరఫరా చేసినట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు పూర్తి వివరాలతో కూడిన నివేదికను అధికారులు.. అబ్కారీ శాఖ ఉన్నతాధికారులకు నివేదించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు
పర్యాటక ప్రాంతాల్లో హోటళ్లు, రిసార్టులకు రేటింగ్ ఇస్తే మంచి కమీషన్ ముట్టజెబుతామని భారీ మోసానికి పాల్పడిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు దేశవ్యాప్తంగా 580 బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.32.34 కోట్ల నగదును జప్తు చేశారు. -
రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో తనిఖీలు
బాపట్ల జిల్లా చీరాల మండలం కావూరివారిపాలెం పంచాయతీ పరిధిలో ఉన్న రాయల్ మెరైన్ రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో గురువారం పలు శాఖల అధికారులు తనిఖీలు చేపట్టారు. -
గ్రూప్-1 ఉద్యోగాల పేరిట టోకరా.. పోలీసుల అదుపులో నిందితుడు
‘గ్రూప్-1’ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ భారీగా డబ్బులు వసూలు చేసి మోసగించిన ముఠాలో ఓ నిందితుడిని వరంగల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
వైకాపా నేత బావమరిది నకిలీ కరెన్సీ నోట్లతో ప్రభుత్వ మద్యం దుకాణంలో మద్యం కొనుగోలు చేయబోయి అక్కడి సిబ్బందికి దొరికిపోయాడు. -
కోటాలో నీట్ విద్యార్థిని ఆత్మహత్య
రాజస్థాన్లో పోటీ పరీక్షల శిక్షణ సంస్థలకు నెలవైన కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. -
ఛత్తీస్గఢ్ అడవుల్లో భారీగా ఎదురుకాల్పులు
మహారాష్ట్ర-ఛత్తీస్గఢ్ సరిహద్దున కాంకర్ అడవుల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య బుధ, గురువారాల్లో భారీగా ఎదురుకాల్పులు జరిగాయి. -
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
ఎయిర్ బ్లోయర్ నాజిల్ను మర్మాంగంలోకి చొప్పించడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్