Crime News: జూబ్లీహిల్స్‌ గ్యాంగ్‌ రేప్‌... పోలీసుల అదుపులో ఇద్దరు?

జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్లో రాత్రి 9గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు  పోలీసులు తెలిపారు

Updated : 03 Jun 2022 21:30 IST

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌లో 17ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచార ఘటనలో ఐదుగురి ప్రమేయం ఉన్నట్టు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం. ఇందులో ఓ ప్రజాప్రతినిధి కుమారుడు ఉన్నట్టు తెలుస్తోంది. కేసు దర్యాప్తు కోసం నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నిందితులు గోవా వైపునకు పారిపోయినట్టు దర్యాప్తు బృందాలు అనుమానిస్తున్నాయి. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గాలింపు చేపట్టారు. ప్రస్తుతం బెంజికారును పోలీసులు సీజ్‌ చేశారు. ఈకేసులో ఓ ఎమ్మెల్యే కుమారుడితో పాటు మరికొందరి ప్రముఖుల కుమారుల పేర్లు తెరపైకి రావడంతో ఈకేసు సంచలనంగా మారింది. తెరాస, ఎంఐఎం నేతల కుమారులు ఉండటంతోనే పోలీసులు ఈ కేసును నీరుగారుస్తున్నారని భాజపా నేతలు ఆరోపిస్తుండగా, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని