Crime News: నడిరోడ్డుపై మహిళకు దారుణ అవమానం.. కేజ్రీవాల్ ఫైర్..!
గణతంత్ర దినోత్సవం రోజున దిల్లీలో అమానవీయ ఘటన జరిగింది. ఇరువర్గాల మధ్య ఉన్న శత్రుత్వం.. నడిరోడ్డుపై ఒక మహిళను దారుణంగా అవమానించేలా చేసింది.
దిల్లీ: గణతంత్ర దినోత్సవం రోజున దిల్లీలో అమానవీయ ఘటన జరిగింది. ఇరువర్గాల మధ్య ఉన్న శత్రుత్వం.. నడిరోడ్డుపై ఒక మహిళను దారుణంగా అవమానించేలా చేసింది. ఆమెపై సామూహిక అత్యాచారానికి కూడా పాల్పడినట్లు పోలీసులకు అందిన ఫిర్యాదు ద్వారా తెలుస్తోంది. దీనిపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. నిందితులకు అంతధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందని మండిపడ్డారు.
ఒక మహిళ జుత్తు కత్తిరించి, ముఖమంతా నలుపు రంగు పూసి, మెడలో చెప్పుల దండ వేసి వివేక్ విహార్ ప్రాంతంలో రోడ్డుపై ఊరేగిస్తోన్న వీడియో ఒకటి గురువారం వెలుగులోకి వచ్చింది. అప్పుడు పక్కనే ఉన్న పలువురు మహిళలు ఈ ఘటనను అడ్డుకోక పోగా.. కేరింతలు కొట్టడం కనిపించింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బాధితురాలు వివాహిత. ఆమె ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయితే కొద్ది రోజుల క్రితం ఒక బాలుడు ఆత్మహత్య చేసుకొని మరణించాడు. అందుకు ఈ మహిళే కారణమని బాలుడి తరఫు బంధువులు ఈ దురాగతానికి పాల్పడ్డారు. దానికి సంబంధించిన దృశ్యాలను దిల్లీ మహిళా కమిషన్ ట్విటర్లో షేర్ చేసింది. అక్రమ మద్యం విక్రయదారులు బాధితురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు మహిళా కమిషన్ ఛైర్మన్ తన ట్వీట్లో పేర్కొన్నారు. ఈ ఘటనపై దిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేశారు. వ్యక్తిగత శత్రుత్వం కారణంగానే ఈ ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఇప్పటికే నలుగురిని అరెస్టు చేశామని, విచారణ జరుగుతోందని తెలిపారు. ప్రస్తుతం బాధితురాలికి కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు చెప్పారు.
ఇది సిగ్గుచేటు చర్య: ‘ఈ ఘటన సిగ్గుచేటు చర్య. ఇలా ప్రవర్తించేందుకు వారికి అంతధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? దీనిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కేంద్రమంత్రి అమిత్ షా, లెఫ్టినెంట్ గవర్నర్ను అభ్యర్థిస్తున్నాను. అలాంటి దురాగతాలను, ఈ తరహా చర్యలకు పాల్పడేవారిని దిల్లీ వాసులు ఏ మాత్రం సహించరు’ అని కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుల బాధతో రైతు బలవన్మరణం
అప్పుల బాధతో ఓ రైతు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. -
ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఘాతుకం
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందాడు. అసిస్టెంట్ కమాండెంట్ తీవ్రంగా గాయపడ్డాడు. -
ఆకర్షణీయమైన ఆఫర్లతో మోసాలు!
కంట్రీక్లబ్ సభ్యత్వం పేరిట నిర్వాహకులు ఆకర్షణీయమైన ఆఫర్లను తెరపైకి తెచ్చి రూ.కోట్ల మేర మోసాలకు పాల్పడుతున్నారంటూ హైదరాబాద్ సోమాజీగూడకు చెందిన న్యాయవాది శ్రీనివాస్ చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
యువతి నోరు మూయించి.. నెల రోజులు అత్యాచారం!
మధ్యప్రదేశ్లోని గుణ ప్రాంతంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. పొరుగింటి వ్యక్తి ఓ యువతిని నెల రోజులపాటు బంధించి, అత్యాచారానికి పాల్పడ్డాడు. -
అన్నమయ్య జిల్లాలో విషాదం.. ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. -
స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యాటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు బుధవారం నీటిలోపడి మృతిచెందారు.
తాజా వార్తలు (Latest News)
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్
-
మా పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారు: బొండా ఉమా
-
యాక్టర్ జగన్.. ఎన్నికల లబ్ధికి ఉత్తుత్తి శిబిరాలు
-
కేరళలో ఒక్క ఓటరు కోసం.. అడవిలో 18 కి.మీ. ప్రయాణం
-
మిమ్మల్ని గద్దెనెక్కిస్తే.. నడిరోడ్డుపై పడేశారు