TS News: బైక్ లిఫ్ట్ అడిగి ఇంజెక్షన్తో చంపిన ఘటనలో కీలక పురోగతి.. కారణం ఇదే..!
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఇంజెక్షన్తో దాడి చేసి వ్యక్తిని చంపిన కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం....
ఖమ్మం: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఇంజెక్షన్తో దాడి చేసి వ్యక్తిని చంపిన కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లభిలో సోమవారం జరిగిన ఈ ఘటనకు వివాహేతర సంబంధమే కారణమని భావిస్తున్నారు. జమాల్ సాహెబ్ అనే వ్యక్తి హత్యలో ముగ్గురి ప్రమేయం ఉన్నట్టు గుర్తించిన పోలీసులు నిందితుల కోసం ముమ్మర గాలింపు కొనసాగిస్తున్నారు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపడంతో ప్రత్యేక దృష్టి సారించిన ఖమ్మం నగర పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్.. ఈ హత్య కేసులో మిస్టరీని ఛేదించేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. అయితే, చింతకాని మండలం మున్నేటికి చెందినవారు ఈ హత్యకు కుట్ర పన్నారని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది. జమాల్ సాహెబ్ను చంపేందుకు నిందితులు పక్కా ప్రణాళిక రచించినట్టు గుర్తించారు. ఈ హత్యలో ఇద్దరు డ్రైవర్లు, ఒక ఆర్ఎంపీ వైద్యుడి ప్రమేయం ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించారు. జమాల్ భార్య ఫోన్ కాల్ జాబితాలో నిందితుల ఫోన్ నంబర్లు ఉన్నాయని.. వారితోనే ఆమె ఎక్కువసార్లు మాట్లాడినట్టు పోలీసులకు ఆధారాలు లభ్యమైనట్లు తెలుస్తోంది.
ఈ కేసును ఛేదించేందుకు రంగంలోకి దిగిన పోలీసు బృందాలు.. తొలుత ముదిగొండ, చింతకాని మండలాల్లో తనిఖీలు చేపట్టాయి. సోమవారం ఎలాంటి ఆధారాలు లభ్యం కాకపోయినప్పటికీ మంగళవారం ఈ కేసు పురోగతికి సంబంధించిన కీలక ఆధారాలను సేకరించారు. గతంలో ఎన్నడూలేని విధంగా బైక్పై వెళ్తున్న వ్యక్తిని లిఫ్ట్ అడిగి మరీ వెనుకనుంచి ఇంజెక్షన్ ఇచ్చి చంపిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించడంతో ఈ కేసును ఛేదించడం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీసులు 24గంటల్లోనే కీలక ఆధారాలు సేకరించారు. ఎవరు చంపారు? ఎందుకు చంపాల్సి వచ్చింది? ఈ హత్యకు దారితీసిన కారణాలేంటి? ఇదే మార్గాన్ని నిందితులు ఎందుకు ఎంచుకున్నారనే కోణంలో దర్యాప్తు మొదలు పెట్టారు. తొలుత ఘటనా స్థలానికి వెళ్లి.. జమాల్ సాహెబ్కు మంచినీళ్లు ఇచ్చిన యువకులను విచారించారు. ఆ తర్వాత స్థానిక గ్రామాలతో పాటు రహదారులపై ఉన్న పలు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించినా ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు.
దీంతో జమాల్ సాహెబ్ కుటుంబ సభ్యులకు ఈ హత్యలో ఏమైనా ప్రమేయం ఉందా? అనే కోణంలో దృష్టిసారించిన పోలీసులు.. మృతుడి కుటుంబ సభ్యుల ఫోన్కాల్ డేటాను సేకరించారు. అందులో కొందరు వ్యక్తులతో ఆయన భార్య సంభాషించినట్టు పక్కా వివరాలు సేకరించి ఈ కేసును ఛేదించేందుకు ప్రయత్నించారు. హత్యకు కుట్ర పన్నిన ముగ్గురు వ్యక్తులు.. జమాల్ సాహెబ్ ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకొని లిఫ్ట్ అడిగి చంపినట్టు సమాచారం. పోలీసులు ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ చింతకాని మండలానికి చెందిన ముగ్గురు వ్యక్తులకు ఈ హత్య కేసులో ప్రమేయం ఉందని గుర్తించారు. వారిలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఈ హత్యకు ప్రధానంగా వివాహేతర సంబంధమే కారణమని ప్రాథమికంగా అనుమానిస్తున్న పోలీసులు ఆ కోణంలోనే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ హత్య కేసుకు సంబంధించిన పూర్తి వివరాలతో పాటు ఇంజెక్షన్తోనే దాడి చేయడానికి కారణాలేంటి? అందులో వాడిన రసాయనం ఏంటి? తదితర వివరాలను పోలీసు ఉన్నతాధికారులు బుధవారం మీడియాకు వెల్లడించే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ముగ్గురి అరెస్ట్
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అనిశా మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ఆయన ఆస్తులకు బినామీలుగా ఉన్న వ్యాపారులు గోదావర్తి సత్యనారాయణమూర్తి(62), పెంట భరత్కుమార్(30), ప్రైవేటు ఉద్యోగి పెంట భరణికుమార్(30)ను వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. -
నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలు
నూడుల్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన వజ్రాలు, ప్రయాణికుల శరీర భాగాల్లో, బ్యాగేజీలో ఉంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. -
వైకాపా నాయకుడి ఇంట్లో 384 మద్యం సీసాలు
శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా నాయకుడు పైడి మహేశ్వరరావు నివాసంలో దాచి ఉంచిన 384 మద్యం సీసాలను టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురికి గాయాలు
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దంపతులు వాటిని తీర్చే దారిలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో జరిగింది. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
-
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
-
మనసుకీ వ్యాయామం ముఖ్యమే.. వేదాంత అధిపతి హెల్త్ టిప్స్
-
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్
-
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
-
వేడుకగా ‘ఆదికేశవ’ నటి వివాహం.. ఫొటో వైరల్