Telangana News: నిజామాబాద్లో కిడ్నాప్ కలకలం.. వ్యక్తిని చితకబాది కారులో ఎత్తుకెళ్లిన దుండగులు
నిజామాబాద్లో కిడ్నాప్ కలకలం రేపింది. ఓ వ్యక్తిని ముగ్గురు దుండగులు చితకబాది కారులో బలవంతంగా ఎక్కించి తీసుకెళ్లారు.
నిజామాబాద్: నిజామాబాద్ పాలిటెక్నిక్ కాలేజి గ్రౌండ్లో యువకుడి అపహరణ కలకలం సృష్టించింది. బుధవారం మధ్యాహ్నం ముగ్గురు దుండగులు తెలుపురంగు కారులో వచ్చి ఓ యువకుడిని చితకబాది కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. ఘటనా స్థలంలో ఉన్న స్థానికులు ఆ దృశ్యాలను సెల్ఫోన్లో చిత్రీకరించి పోలీసులకు సమాచారమందించారు. వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితులు కారులో బోధన్వైపు వెళ్లినట్టు గుర్తించారు. నిందితులు ఉపయోగించిన కారు TS29C 6688 నంబరుతో బోధన్కు చెందిన సింగం బాగయ్య పేరుతో రిజిస్ట్రేషన్ అయింది. బాగయ్య అల్లుడు అఖిలేష్ ఈరోజు ఉదయం బోధన్ నుంచి కారును నిజామాబాద్ తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. అఖిలేష్ స్నేహితుడికి సంబంధించిన ఓ యువతిని మరో వ్యక్తి వేధించడమే ఘటనకు కారణమని తెలుస్తోంది. దీంతో యువకుడిని పాలిటెక్నిక్ గ్రౌండ్కు పిలిపించి అతన్ని చితకబాది వాహనంలో బోధన్ వైపు తీసుకెళ్లారు. సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా నిందితుల ఆచూకీ గుర్తించిన పోలీసులు వారిని బోదన్ పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా