Crime news: బైక్‌పై వెళ్తున్నవ్యక్తి ప్రాణం తీసినగాలిపటం మాంజా

సంక్రాంతి పండగ సందర్భంగా ఎగరేసిన గాలిపటం ఒకరి కుటుంబంలో విషాదాన్ని నింపింది.

Published : 16 Jan 2022 07:44 IST

మంచిర్యాల: సంక్రాంతి పండగ సందర్భంగా ఎగరేసిన గాలిపటం ఒకరి కుటుంబంలో విషాదాన్ని నింపింది. గాలిపటం మాంజా వల్ల గొంతు తెగి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన తెలంగాణలోని మంచిర్యాలలో చోటు చేసుకుంది. దంపతులు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా గాలిపటానికి కట్టిన మాంజా వాహనం నడుపుతున్న వ్యక్తి మెడకు చుట్టుకుంది. బైకు వేగానికి మాంజా వాహనదారుడికి మెడకు బిగుసుకుపోయి గొంతు కోసుకుపోయింది. దీంతో తీవ్ర రక్తస్రావమై అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. కళ్లెదుటే భర్త గొంతు తెగి చనిపోవడంతో భార్య కన్నీరుమున్నీరుగా విలపించడం అందరినీ కలచివేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని